ఏ క్షణమైనా అణుయుద్ధం! అమెరికా భూభాగం మొత్తం.. ఉత్తరకొరియా ఫైరింగ్ రేంజ్ లో!? టెన్షన్.. టెన్షన్
అమెరికా, ఉత్తరకొరియా మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. ఏ క్షణంలోనైనా అణుయుద్ధం రావచ్చంటూ.. ఐక్యరాజ్య సమితి ఉత్తరకొరియా డిప్యూటీ అంబాసిడర్ కిమ్ ఇన్ ర్యాంగ్ హెచ్చరించారు.
ఐక్యరాజ్యసమితి: అమెరికా, ఉత్తరకొరియా మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. ఏ క్షణంలోనైనా అణుయుద్ధం రావచ్చంటూ.. ఐక్యరాజ్య సమితి ఉత్తరకొరియా డిప్యూటీ అంబాసిడర్ కిమ్ ఇన్ ర్యాంగ్ హెచ్చరించారు.
ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో తాజాగా మాట్లాడుతూ.. తమ దేశ క్షిపణి కార్యక్రమాలు వ్యూహాత్మకంగా చేపడుతున్నవని, వాటిని నిలిపివేసే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు.

ముప్పు తొలగిపోయే వరకూ...
ఉత్తర కొరియా అణు సంపత్తిని, అది చేపడుతున్న క్షిపణి ప్రయోగాలను ఐక్యరాజ్యసమితిలో ఆ దేశ డిప్యూటీ అంబాసిడర్ కిమ్ ఇన్ ర్యాంగ్ సమర్థించుకున్నారు. 1970 నుంచీ ఉత్తరకొరియా.. అమెరికాకు టార్గెట్ గా మారిందని ఆయన ఆరోపించారు. అధ్యక్షుడిగా ట్రంప్ వచ్చిన తరువాత ఈ ముప్పు మరింత అధికమైందన్నారు. మాటలతో రెచ్చగొట్టడం ట్రంప్ కు అలవాటుగా మారిందని కిమ్ దుయ్యబట్టారు. అమెరికా నుంచి అణుముప్పు పూర్తిగా తొలిగేపోయేవరకూ తమ దేశం అణ్వాయుధాలు, బాలిస్టిక్ రాకెట్ల తయారీని నిలిపివేయదని కూడా ఆయన స్పష్టం చేశారు.

అది మా హక్కు...
అణు పరీక్షలు తాము ఏటా నిర్వహించే మిలిటరీ ఎక్సర్ సైజ్ లలో భాగమేనని ఉత్తరకొరియా డిప్యూటీ అంబాసిడర్ కిమ్ ఇన్ ర్యాంగ్ పేర్కొన్నారు. అమెరికా నుంచి ముప్పు ఏర్పడిన నేపథ్యంలోనే తమ దేశం ఆయుధాలు తయారు చేస్తోందని చెప్పుకొచ్చారు. ఆత్మరక్షణ కోసం అణ్వాయుధాలు కలిగి ఉండడం తమ హక్కు అని, వాటిని తయారు చేయరాదంటూ ఒత్తిడి తెచ్చే హక్కు ఎవరికీ లేదని ఐక్యరాజ్య సమితి నిరాయుధీకరణ కమిటీకి ఆయన తేల్చి చెప్పారు. ఉత్తరకొరియా చేపట్టిన అణుకార్యక్రమాన్ని ఆపివేయించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఐక్యరాజ్యసమితిచే ఆంక్షలు కూడా విధింపజేశారు. మిత్ర దేశమైన చైనా కూడా ఉత్తరకొరియాకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించి విఫలమైంది.

అమెరికా చర్యలే కారణమా?
ఏ క్షణంలోనైనా అణుయుద్ధం రావచ్చంటూ ఐక్యరాజ్యసమితిలో ఉత్తరకొరియా డిప్యూటీ అంబాసిడర్ కిమ్ ఇన్ ర్యాంగ్ చేసిన తాజా ప్రకటనతో ప్రపంచ దేశాలన్నీ ఉలిక్కిపడ్డాయి. ఇన్నాళ్లూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ ల ‘పిల్లీ ఎలుక ఆట'ను చూసి నవ్వుకుంటున్న పలు దేశాలు ఈ తాజా ప్రకటనతో నివ్వెరపోయాయి. ఉన్నట్లుండి ఉత్తరకొరియా డిప్యూటీ అంబాసిడర్ ఈ స్థాయిలో హెచ్చరిక చేయడానికి కారణమేమిటో ఆయన మాటల్లోనే బోధపడింది. తమ దేశ అగ్రనాయకత్వాన్ని తుడిచిపెట్టేందుకు కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నిస్తున్నారని, దీనికోసం ఆయన ఓ సీక్రెట్ మిషన్ ఏర్పాటు చేశారంటూ ఉత్తరకొరియా డిప్యూటీ అంబాసిడర్ కిమ్ ఇన్ ర్యాంగ్ మండిపడ్డారు.

మా భూభాగంలో ఓ అంగుళంపై దండెత్తినా...
ఎవరి మాటా లెక్కచేయకుండా.. వరుస క్షిపణి పరీక్షలకు పాల్పడి, అంతలోనే హైడ్రోజన్ బాంబును పరీక్షించామంటూ ప్రకటించి ప్రపంచ దేశాలను అయోమయంలో పడేసిన ఉత్తరకొరియా.. ఆ మధ్యన అమెరికా అధీనంలో ఉన్న గువామ్ ద్వీపంపై నేరుగా క్షిపణి దాడి చేస్తామంటూ హడలెత్తించిన విషయం తెలిసిందే. ఉత్తరకొరియా ప్రకటనతో నిపుణులు సైతం ఆశ్చర్యపోయారు. ఉత్తరకొరియాకు అంత సత్తా ఉందా? అని అనుమానాలు వ్యక్తం చేశారు. ఏదో ఒకరోజు ఉత్తరకొరియా కొంప ముంచేలాగే ఉందని భయపడ్డారు. ఈ నేపథ్యంలో ఈ భయాందోళనను ఇంకాస్త పెంచారు ఉత్తరకొరియా డిప్యూటీ అంబాసిడర్ కిమ్ ఇన్ ర్యాంగ్. అమెరికా భూభాగం మొత్తం తమ ఫైరింగ్ రేంజ్ లో ఉందంటూ ఆయన తాజాగా బాంబు పేల్చారు. అంతేకాదు, ట్రంప్.. ఉత్తరకొరియా భూభాగంలో ఓ అంగుళంపై దండెత్తే దుస్సాహసానికి పాల్పడినా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

అమెరికా మిత్రదేశాలకూ అల్టిమేటం...
ఏ క్షణంలోనైనా అణుయుద్ధం రావచ్చంటూ ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో తాజాగా హెచ్చరిక చేసిన ఉత్తరకొరియా డిప్యూటీ అంబాసిడర్ కిమ్ ఇన్ ర్యాంగ్ అమెరికాకే కాకుండా దానికి మద్దతు పలికే బ్రిటన్, జపాన్ వంటి ఇతర దేశాలకు కూడా అల్టిమేటం ఇచ్చారు. ఉత్తరకొరియాతో అమెరికాకు యుద్ధం వస్తే.. అమెరికాకు మద్దతుగా యుద్ధంలో పాల్గొనేందుకు ఇటీవల బ్రిటన్.. క్వీన్ ఎలిజబెత్ అనే యుద్ధనౌకను రంగంలోకి దించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో.. ఒకవేళ యుద్ధమంటూ వస్తే.. అమెరికాతో మిత్రదేశాలు కలవకపోవడమే శ్రేయస్కరమని, గొప్పలకుపోయి లేనిపోని ముప్పు తెచ్చుకోవద్దని ఆయన జపాన్, బ్రిటన్ లను ఉద్దేశించి హితవు పలికారు. అవసరమైతే ఇతర దేశాలపైనా అణుబాంబు వేసేందుకు తమ దేశం ఏమాత్రం వెనకాడదని, అలాంటి పరిస్థితి రాదనే తాము భావిస్తున్నామని కిమ్ ఇన్ ర్యాంగ్ పేర్కొన్నారు.

దక్షిణ కొరియాలోని అమెరికన్లకు సూచన...
ఐక్యరాజ్య సమితిలో ఉత్తరకొరియా డిప్యూటీ అంబాసిడర్ కిమ్ ఇన్ ర్యాంగ్ తాజా హెచ్చరికతో అమెరికా అప్రమత్తమైంది. ఉత్తరకొరియా యుద్ధమంటూ మొదలెడితే తక్షణ ముప్పు పక్కనే ఉన్న దక్షిణ కొరియాకే. ఆ విషయం తెలిసిన అమెరికా దక్షిణ కొరియాలోని తన పౌరులను హెచ్చరించింది. తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని, దక్షిణ కొరియాను వీడి వెనక్కి రావడం చాలా మంచిదని సూచించింది.

చర్చలకు ఇంకా ఛాన్స్ ఉంది...
ఉత్తరకొరియా డిప్యూటీ అంబాసిడర్ కిమ్ ఇన్ ర్యాంగ్ తాజా హెచ్చరికలపై అమెరికా స్టేట్ సెక్రటరీ రెక్స్ టిల్లర్సన్ స్పందించారు. సాధ్యమైనంత వరకు ఉత్తరకొరియాతో యుద్ధం చేయకూడదనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నారని ఆయన తెలిపారు. ‘‘రెక్స్ టిల్లర్సన్ .. ఉత్తరకొరియా ఇష్యూలో మీరు టైం వేస్ట్ చేసుకుంటున్నారు.. మీ సత్తాని దాచుకోండి..'' అంటూ గతంలో ట్రంప్ ట్వీట్ చేశారు. ఆ తరువాత కూడా.. ‘‘ఉత్తరకొరియాతో వివాదం పరిష్కారానికి అన్ని దారులు మూసుకుపోయాయి.. ఇప్పుడిక ఒకే ఒక మార్గం మిగిలి ఉంది..'' అంటూ పరోక్షంగా యుద్ధం గురించి ట్రంప్ వ్యాఖ్యానించారు. అయినా సరే, ఉత్తరకొరియాతో చర్చలు జరిపేందుకు ఇప్పటికీ అవకాశం ఉందని, ఆ దేశం మొదటి బాంబు వేసేంత వరకు వేచి చూస్తామని అమెరికా స్టేట్ సెక్రటరీ రెక్స్ టిల్లర్సన్ వ్యాఖ్యానించారు.
-
అమెరికా అలా చేస్తే ట్రంప్ తల తీసుకెళ్తాం: ఇరాన్ సంచలన వార్నింగ్ -
భారత్ కు బిగ్ షాక్- హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయనున్న ఇరాన్ -
ఇజ్రాయెల్ కు షాకిచ్చిన ట్రంప్, ఇప్పుడు ఏం చేద్దాం? -
చేతులెత్తేసిన ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్.. -
ఖమేనీ సంధి ఒప్పందం? -
అదే జరిగితే ఇరాన్ ను అంతం చేస్తాం: ట్రంప్ వార్నింగ్ -
Donald trump: ట్రంప్ ప్రకటనతో కుప్పకూలిన చమురు, గ్యాస్ ధరలు..! -
ట్రంప్ కు ముందు నుయ్యి, వెనుక గొయ్యి-ఎలాగో చెప్పిన మాజీ రక్షణమంత్రి..! -
ట్రంప్ మాటలు నమ్మొద్దు.. యుద్ధం కొనసాగుతోంది: ఇరాన్ సంచలనం -
కుప్పకూలుతున్న అమెరికా ఫైటర్ జెట్స్.. వెనక్కు తగ్గిన ట్రంప్..!! -
Trump: నువ్వేగా ఇరాన్ వార్ చేద్దామన్నావ్..! ఆయనపై నెపం నెట్టేసిన ట్రంప్..! -
Trump: ట్రంప్ ప్రకటనపై స్పందించిన కేంద్రం- కీలక వ్యాఖ్యలు..!












Click it and Unblock the Notifications