హిందూ దేశంగా ప్రకటించండి: నేపాల్ ముస్లింలు
ఖాట్మాండ్: నేపాల్ను హిందూ దేశంగా ప్రకటించాలనే డిమాండ్ ఆ దేశంలో జోరుగా సాగుతోంది. తాజాగా ఈ డిమాండ్కు ఆ దేశంలో ఉన్న ముస్లింలు కూడా మద్దతు పలికారు.
నేపాల్ను హిందూ దేశంగా ప్రకటించాలని.. గత కొంత కాలంగా జరుగుతున్న ప్రచారానికి తాజాగా ఆ దేశ మస్లీంలు మద్దతు పలకటం ఒక అసాధారణ చర్య అయినప్పటికీ, గొంతు కలపటం విశేషం.
‘నేపాల్ ఒక లౌకిక రాజ్యంగా ఉండటం కంటే, హిందూ దేశంగా ఉండటమే మంచిది. ఇది నా స్వంత మతం ఇస్లాంను కాపాడు కోవటానికే నోరు విప్పి మాట్లాడుతున్నా' అని నేపాల్ రప్తి ముస్లీం సొసైటీ ఛైర్మన్ అజ్మత్ అన్నారు.
నేపాల్లో కొన్ని మిషనరీలు క్రైస్తవ మతం అనుసరించాడానికి ప్రభావితం చేస్తున్నాయని, సీపీఎన్-యూఎమ్ఎల్ సీఏ సభ్యుడు అనార్కలీ మియా అన్నారు. నేపాల్ లౌకిక దేశంగా కొనసాగటం వల్ల రానున్న రోజుల్లో మరిన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయని, మియా అన్నారు.
నేపాల్ రఫ్తి ముస్లిం సొసైటీ ఛైర్మన్ అజ్మత్ మాట్లాడుతూ, నేపాల్ లౌకిక దేశంగా కొనసాగడం కంటే... హిందూ దేశంగా కొనసాగడమే మేలని స్పష్టం చేశారు. నేపాల్ లో ఇస్లాం మతాన్ని కాపాడుకోవాలంటే... ఈ దేశం హిందూ దేశంగానే ఉండాలని ఆయన అన్నారు.