ఐఎస్ కాల్పుల్లో 4గురు భారత నర్సులు మృతి
యెమెన్: అడెన్ ప్రాంతంలోని షేక్ ఉస్మాన్లోని సంరక్షణాలయంలో శుక్రవారం నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో నలుగురు భారతీయ నర్సులు సహా 16మంది మృత్యువాతపడ్డారు.
అక్కడి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నలుగురు సాయుధులు శుక్రవారం నర్సులపై కాల్పులకు తెగబడ్డారు. కొందరు ప్రజల చేతులు కట్టేసి కాల్చి చంపారు. దాడికి పాల్పడింది తామేనని ఐఎస్ ఉగ్రవాదులు ప్రకటించుకున్నట్లు సమాచారం.

ఘోర రోడ్డు ప్రమాదం.. 30 మంది మృతి
జింబాబ్వేలో రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 30 మంది మరణించగా, మరో 36 మంది గాయాలపాలయ్యారు. జింబాబ్వే రాజధాని హరారే నుంచి బులవాయో నగరానికి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.
రెండు బస్సులు డ్రైవర్లతో కలిపి 28 మంది ప్రమాదస్థలంలో అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. గాయపడిన వారిలో 32 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
-
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications