వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మత్తు మందు ఇచ్చి వంద మందికిపైగా మహిళలపై రేప్

By Pratap
|
Google Oneindia TeluguNews

టోక్యో: మత్తు మందు ఇచ్చి స్పృహ తప్పిన తర్వాత వంద మందికిపైగా మహిళలపై అత్యాచారం చేసిన వ్యక్తిని జపాన్ పోలీసులు అరెస్టు చేశారు. వైద్య అధ్యయనంలో పాల్గొంటున్న అభిప్రాయం కలిగించి ఆ వ్యక్తి అత్యంత దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి జాతీయ మీడియాలో వార్తాకథనాలు వచ్చాయి.

నిద్ర సమయంలో రక్తం పొటును కొలవడంపై క్లినికల్ రీసెర్చ్ పేరు మీద వచ్చిన వాణిజ్య ప్రకటనకు పెద్ద యెత్తున మహిళలు ప్రతిస్పందించినట్లు డిటెక్టివ్‌లు చెబుతున్నారు. 2013 నవంబర్ నుంచి గత రెండేళ్లుగా ఈ తంతు కొనసాగుతోంది.

Over 100 drugged and raped in Japan fake clinical study

హిదేయుకి నోగుచి అనే 54 వ్యక్థి మహిళలను హోటళ్లకు, హాట్ స్ప్రింగ్ రిసార్ట్‌లకు రప్పించిన తర్వాత వారికి మత్తు మందు ఇచ్చేవాడని అంటున్నారు. వారు స్పృహ తప్పగానే వారిపై అత్యాచారం చేసి, ఆ దృశ్యాలను చిత్రీకరించేవాడని అంటున్నారు. లైంగిక దాడికి సంబంధించిన ఫుటేజ్‌లను ఇంటర్నెట్‌లో పోస్టు చేసేవాడని లేదా అశ్లీల చిత్రాల నిర్మాతలకు విక్రయించేవాడని ఆరోపిస్తున్నారు. ఆ రకంగా అతను 85 వేల డాలర్లకు పైగా ఆర్జించినట్లు సమాచారం.

నిజానికి నొగూచికి వైద్య శిక్షణ లేదు, వైద్య నిపుణుడు కూడా కాడు. టోక్యో, చిబా, ఒసాకా, తోచిగి, షిజౌకాలకు చెందిన యుక్తవయస్కుల నుంచి 40 ఏళ్ల మహిళల వరకు కనీసం 39 మంది బాధితులను గుర్తించినట్లు పోలీసులు చెబుతున్నారు. నొగూచి దాడికి గురైనవాళ్ల మహిళ సంఖ్య ఇంకా ఎక్కువగా, వందకు పైగా ఉంటుందని డిటెక్టివ్‌లు అంటున్నారు.

English summary
Japanese police have arrested a man for allegedly drugging and sexually assaulting more than 100 women who believed they were taking part in a medical study, detectives and local media said on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X