2 వేలమంది ఉగ్రవాదులు: బంగ్లాదేశ్ నివేదిక, భారత్లో కలకలం!
బంగ్లాదేశ్ ఇచ్చిన నివేదిక ఒకటి ఇప్పుడు భారత్లో కలకలం రేపుతోంది. తమ దేశం నుంచి ఏకంగా 2000 వేలమందికి పైగా ఉగ్రవాదులు భారత భూభాగంలోకి ప్రవేశించారని భారత హోంశాఖకు బంగ్లాదేశ్ నివేదిక ఇచ్చింది.
ఢాకా/న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ ఇచ్చిన నివేదిక ఒకటి ఇప్పుడు భారత్లో కలకలం రేపుతోంది. తమ దేశం నుంచి ఏకంగా 2000 వేలమందికి పైగా ఉగ్రవాదులు భారత భూభాగంలోకి ప్రవేశించారని భారత హోంశాఖకు బంగ్లాదేశ్ నివేదిక ఇచ్చింది.
ఇందుకు సంబంధించిన పక్కా ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, భారత్లో చొరబడిన ఉగ్రవాదులంతా జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ), హర్కత్ ఉల్ జిహాదీ అల్ ఇస్లామీ(హుజీ) సంస్థలకు చెందినవారని ఆ నివేదికలో పేర్కొంది.
కేంద్రం షాక్: లావాదేవీల కుదింపు, రూ.2 లక్షలు దాటితే భారీ ఫైన్
గత ఏడాది వీరు తమ సరిహద్దులను దాటి పశ్చిమ బెంగాల్, అసోం, త్రిపుర రాష్ట్రాల్లో అడుపెట్టారని తెలిపింది. భారత్లో చొరబడిన 2,010 మంది ఉగ్రవాదుల్లో 1,290 మంది అసోం, త్రిపుర రాష్ట్రాల్లో ప్రవేశించగా.. మిగతా వారు పశ్చిమ బెంగాల్కు వెళ్లారని పేర్కొంది.
ఈ నివేదికతో త్రిపుర, అసోం రాష్ట్రాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉగ్రవాదుల ఆచూకీ కోసం భద్రతా దళాలను రంగంలోకి దించినట్టు తెలుస్తోంది.