పాక్ సుప్రీం అనూహ్యం -టెర్రరిస్టు ఒమర్ సయీద్ విడుదల -జర్నలిస్టు డానియెల్ హత్య కేసులో ట్విస్ట్
టెర్రరిస్టుల కార్ఖానాగా పేరుపొందిన పాకిస్తాన్లో.. ప్రభుత్వం, కోర్టులే టెర్రరిస్టులకు కొమ్ముకొస్తున్నాయని ఆరోపణలు వస్తున్నా అక్కడి పరిస్థితులు మాత్రం మారడంలేదు. పాక్ అత్యున్నత న్యాయస్థానం తాజాగా మరో కరడుగట్టిన ఉగ్రవాదికి స్వేచ్ఛ కల్పించింది. అమెరికా-పాకిస్తాన్ ల సంబంధాలను ప్రభావితం చేసే, భారత్ కు కూడా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుగా ఉన్న ఒమర్ సయీద్ షేక్ జైలు నుంచి విడుదలయ్యేందుకు రంగం సిద్ధమైంది..
ప్రఖ్యాత మీడియా సంస్థ వాల్ స్ట్రీట్ జనరల్ కు దక్షిణాసియా బ్యూరో చీఫ్ గా వ్యవహరించిన అమెరికా జర్నలిస్టు డానియెల్ పెర్ల్ కిడ్నాప్, హత్య కేసులో నిందితులైన ఒమర్ సయీద్ సహా మరో ముగ్గురు టెర్రరిస్టులపై ఎలాంటి చర్యలు వద్దని, వారిని తక్షణమే విడుదల చేయాలని పాక్ సుప్రీంకోర్టు గురువారం ఆదేశాలిచ్చింది. జర్నలిస్టు హత్య కేసులో సయీద్ సహా ముగ్గురికి విధించిన మరణశిక్షను సింధ్ హైకోర్టు రద్దు చేయగా, దానిని సవాలు చేస్తూ ఇమ్రాన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ మేరకు నిర్ణయం వెలువడింది.

బ్రిటిష్-పాకిస్తానీ జాతీయుడైన ఒమర్ సయీద్... 1999 నాటి ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం హైజాక్ ఘటనతో పాపురల్ అయ్యాడు. నాడు విమానాన్ని హైజాక్ చేసిన తాలిబన్లు.. భారత్ నుంచి విడిపించుకొని వెళ్లిన టెర్రరిస్టుల్లో ఒమర్ సయీద్ కూడా ఒకడు. ఇతని టీమ్.. 2002లో వాల్ స్ట్రీట్ జర్నలిస్టు డానియెల్ పెర్ల్ ను కిడ్నాప్ చేసి, దారుణంగా గొంతు కోసి హత్య చేసింది. ఈ ఘటనను అమెరికా ప్రభుత్వం తీవ్రంగా పరిగణించడంతో సయీద్ బృందాన్ని పాక్ పోలీసులు లాహోర్ లో అరెస్టు చేశారు. కరాచీలోని యాంటీ టెర్రరిస్టు కోర్టు వీరికి మరణశిక్షలు విధించింది. కాగా, తాము నిర్దోషులమంటూ సయీద్ సహా మరో ముగ్గురు సింధ్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో..
18 ఏళ్ల సుదీర్ఘ వాదనల తర్వాత.. డానియెల్ పెర్ల్ హత్య కేసులో ఒమర్ సయీద్ పాత్ర అతి కొద్ది శాతమేనని, అతని టీమ్ సభ్యులుగా పేరున్న ఫాహద్ నసీం, షేక్ ఆదిల్, సల్మాన్ సాఖిబ్ లు పూర్తిగా నిర్దోషులని పేర్కొంటూ సింధ్ హైకోర్టు గతేడాది(2020) ఏప్రిల్ లో తీర్పు చెప్పింది. ఒమర్ సయీద్ ను సుదీర్ఘ కాలం జైలులో ఉంచడం చట్టవిరుద్దమని వ్యాఖ్యానించిన హైకోర్టు.. జర్నలిస్టు హత్య కేసులో అతనికి విధించాల్సిన 7ఏళ్ల జైలు శిక్ష ఎప్పుడో పూర్తయిపోయింది కాబట్టి వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. కాగా,
ఒమర్ సయీద్ సహా నలుగురు టెర్రరిస్టులను సింధ్ హైకోర్టు నిర్దోషులుగా తేల్చడంపై ఇమ్రాన్ ఖాన్ సర్కారు సైతం అభ్యంతరం వ్యక్తం చేసింది. సింధ్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయిచింది. 10 నెలల విచారణ అనంతరం పాక్ సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది. జర్నలిస్టు డానియెల్ హత్య కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పునే సుప్రీం కూడా సమర్థించింది. ప్రభుత్వం సహా పలువురు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేస్తూ.. ఆ నలుగురిని తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలని జస్టిస్ ముషిర్ ఆలం బెంచ్ గురువారం ఆదేశాలిచ్చింది. అయితే, గురువారం గడువు ముగియడం, శుక్రవారం జాతీయ సెలవు దినం కావడంతో టెర్రరిస్టు ఒమర్ సయీద్, అతని అనుచరులు ముగ్గురు శనివారం జైలు నుంచి విడుదల కానున్నారు.
-
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
Peddireddy Ramachandra Reddy: సుప్రీంకోర్టులో పెద్దిరెడ్డికి ఝలక్ - చంద్రబాబుతో వ్యవహారంలో..! -
ఎస్సీ రిజర్వేషన్లు రద్దు!: సుప్రీంకోర్టు సంచలన తీర్పు -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు











Click it and Unblock the Notifications