Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాశ్మీర్‌పై మళ్లీ అదే పాత రాగం.. UNSC అధ్యక్ష హోదాలో పాకిస్థాన్!

Pakistan: పాకిస్థాన్ జనవరి 2025లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(UNSC)కి తాత్కాలిక సభ్యుడిగా ఎన్నికైంది. ఇప్పుడు రొటేషన్ ప్రకారం మంగళవారం UNSC అధ్యక్ష బాధ్యతలను స్వీకరించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని 5 శాశ్వత సభ్య దేశాలు(అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్), 10 తాత్కాలిక సభ్య దేశాలు అంటే మండలిలోని 15 సభ్య దేశాల మధ్య దీని అధ్యక్ష పదవి అక్షర క్రమంలో తిరుగుతూ ఉంటుంది.య ప్రతి సభ్య దేశానికి ఒక నెల పాటు అధ్యక్ష పదవి ఉంటుంది. జులై నెల అధ్యక్ష పదవి పాకిస్థాన్‌కు లభించింది. అధ్యక్ష పదవి లభించగానే పాకిస్థాన్ భారత్‌కు వ్యతిరేకంగా కమర్షియల్ ఎజెండాను ప్రారంభించింది. మరోసారి అదే పాత కాశ్మీర్ రాగాన్ని ఎత్తుకుంది. దీనిని భారత్ ఎల్లప్పుడూ ద్వైపాక్షిక సమస్య అని చెబుతూ వస్తోంది.

ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్ రాయబారి అసీమ్ ఇఫ్తిఖార్ అహ్మద్ మాట్లాడుతూ.. కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. పాకిస్థానీ రాయబారి ద్వైపాక్షిక అంశాన్ని అంతర్జాతీయీకరించడానికి ప్రయత్నిస్తూ.. కాశ్మీర్ వివాదాస్పద సమస్య భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు కారణమని అన్నారు.

Pakistan as UNSC Chair Will Its Kashmir Move Corner India

ఐక్యరాజ్యసమితి న్యూయార్క్ ప్రధాన కార్యాలయంలో మాట్లాడుతూ పాకిస్థానీ రాయబారి ఇలా అన్నారు. "ప్రపంచం ఇప్పుడు ఈ సమస్యపై పని చేయాల్సిన అవసరం ఉంది. కాశ్మీర్ సమస్య గురించి మాట్లాడటానికి ఇదే సరైన సమయం. ఇది కేవలం పాకిస్థాన్ బాధ్యత మాత్రమే కాదు. మేము ఇక్కడ తాత్కాలిక సభ్యులం. రెండేళ్లపాటు తాత్కాలిక సభ్యులం. ఈ సమస్య భద్రతా మండలికి, ముఖ్యంగా మండలి శాశ్వత సభ్యులకు కూడా సంబంధించినదని నేను నమ్ముతున్నాను. ఈ సమస్యను ఐక్యరాజ్యసమితి నిబంధనల ప్రకారం పరిష్కరించడానికి వారు చర్యలు తీసుకోవాలి. ఇదే ఒకే ఒక్క మార్గం." అని పాకిస్థానీ రాయబారీ పేర్కొన్నారు.

సిమ్లా ఒప్పందం రద్దు.. కాశ్మీర్ గురించి పాకిస్థాన్ ఏడుపు
ఏప్రిల్ 22న పహల్గామ్‌లో పాకిస్థాన్ మద్దతుతో జరిగిన దాడిలో 26 మంది మరణించారు. దీనికి ప్రతీకారంగా భారత్ పాకిస్థాన్‌తో సింధు జల ఒప్పందాన్ని నిలిపివేసింది. పాకిస్థాన్,పీవోకేలో ఉన్న ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఆపరేషన్ సింధూర్ ప్రారంభించింది. దీని తర్వాత భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య 4 రోజుల పాటు యుద్ధం జరిగింది. భారత్‌తో జరిగిన పోరాటంలో ఘోరంగా దెబ్బతిన్న పాకిస్థాన్ ఆగ్రహంతో భారత్‌తో సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసింది. ఈ సిమ్లా ఒప్పందం ప్రకారం.. రెండు దేశాలు తమ పరస్పర సమస్యలను ద్వైపాక్షిక పద్ధతిలో పరిష్కరించుకోవాలని నిర్ణయించబడింది.

అయితే గతంలో పాకిస్థాన్ ఒప్పందంలో ఉన్న సమయంలో కూడా కాశ్మీర్ సమస్యను అనేకసార్లు ప్రపంచ వేదికలపై లేవనెత్తింది. సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసిన తర్వాత ద్వైపాక్షిక సమస్యలను అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తడానికి పాకిస్థాన్‌కు ఇప్పుడు పూర్తి స్వేచ్ఛ లభించింది. అయితే, ఐక్యరాజ్యసమితి బలహీనమైన స్థితిని బట్టి చూస్తే.. ఈ సమస్యను అంతర్జాతీయీకరించడంలో పాకిస్థాన్ పెద్దగా విజయం సాధించగలదని అనిపించడం లేదు. పైగా ప్రపంచంలోని రెండు అగ్రశక్తులు అమెరికా, రష్యా దేశాలు భారత్‌కు సన్నిహిత దేశాలు కావడం గమనార్హం. ఇవి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యులు కూడా.

కాశ్మీర్ సమస్య తమ అంతర్గత విషయమని, కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని.. దాని గురించి చర్చించాల్సిన అవసరం లేదని భారత్ ఎల్లప్పుడూ చెబుతూ వస్తోంది. పాకిస్థాన్‌తో చర్చలంటూ జరిగితే.. అది పాక్ అక్రమంగా ఆక్రమించిన కాశ్మీర్‌‌ను భారత్‌కు తిరిగి ఇవ్వడంపైనే జరుగుతుందని ఇండియా స్పష్టంగా చెబుతోంది. ఈ క్రమంలో భారత్‌కు వ్యతిరేకంగా తన లక్ష్యాన్ని పాకిస్థాన్ సాధించగలదని అనిపించడం లేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+