పీటీఐకి 116 సీట్లు, చర్చలు: ప్రతిపక్షాలు ఏకం.. రోడ్డెక్కితే ఇమ్రాన్కు చుక్కలే
కరాచి: పాక్ ఎన్నికల్లో ఫలితాలు తేలాయి. ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐకి 116 స్థానాలు వచ్చాయి. నవాజ్ షరీఫ్కు చెందిన పీఎంఎల్ఎన్ 64, బిలావల్ భుట్టో జర్దారీ పీపీపీకి 43 సీట్లు వచ్చాయి. మిగతా స్థానాల్లో చిన్న పార్టీలు, స్వతంత్రులు గెలిచారు. ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వం దిశగా ఇమ్రాన్ ఖాన్ అడుగులు వేస్తున్నారు.
కేంద్ర మంత్రిమండలి కూర్పు, పంజాబ్ ప్రావిన్స్లో ప్రభుత్వ ఏర్పాటు వంటి అంశాలను పార్టీ సహచరులతో ఆయన చర్చిస్తున్నారు. పాకిస్థాన్ స్వాతంత్య్ర దినమైన ఆగస్ట్ 14వ తేదీకి ముందే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవానికి కాస్త అటు ఇటు ఇమ్రాన్ ప్రమాణ స్వీకారం ఉండనుందని చెబుతున్నారు. చిన్న పార్టీలు, స్వతంత్రులు, ఎంక్యూఎం-పీ పార్టీతో ఇమ్రాన్ ఖాన్ పార్టీ చర్చలు జరుపుతోంది.

మరోవైపు, ఎన్నికల ఫలితాలను విపక్షాలు అంగీకరించడం లేదు. రిగ్గింగ్ జరిగిందని, కాబట్టి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని పట్టుబడుతున్నాయి. ఈ మేరకు విపక్షాలన్నీ అఖిలపక్షాన్ని నిర్వహించాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్షాలు ఏకమై రోడ్లపైకి వస్తే అస్థిరత ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.
ప్రతిపక్షంలో కూర్చునేందుకు తాము సిద్ధమని నవాజ్ షరీఫ్ పార్టీ తొలుత ప్రకటించినా, ఆ తర్వాత విపక్షాలతో కలిసి గొంతు కలిపాయి. రిగ్గింగ్ పైన గళమెత్తుతున్నాయి. పార్లమెంటును బహిష్కరించే యోచన చేస్తున్నారు.
జాతీయస్థాయిలో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం లేదు కాబట్టి పంజాబ్ ప్రావిన్సులోనైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పీఎంఎల్ఎన్ ప్రయత్నాలు చేస్తోంది. పంజాబ్ ప్రావిన్సులో పీఎంఎల్ఎన్ 129 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. సింధ్లో పీపీపీ (76), ఖైబర్ పక్తుంఖ్వాలో పీటీఐ (66), బెలూచిస్తీన్లో బెలూచిస్తాన్ అవామీ పార్టీ (15) నెగ్గాయి.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications