యువతిపై అత్యాచారం: కుటుంబ సభ్యులే ఈ ప్లాన్ చేశారు, ఎక్కడంటే?
ఇస్లామాబాద్: ఒకరు చేసిన తప్పు, మరోకరికి తీవ్ర ఇబ్బందులను తెచ్చి పెట్టింది. ఏ పాపం తెలియని ఇద్దరు యువతులు అత్యాచారానికి గురయ్యారు. గ్రామ పెద్దలు విధించిన మూర్ఖమైన తీర్పు ఇద్దరి యువతుల జీవితాలను బలితీసుకొంది. అయితే ఈ ఘటనకు కారణమైన నిందితులను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.
పాకిస్థాన్లోని చోటు చేసుకొన్న ఓ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఓ యువతిపై ఓ వ్యక్తి అత్యాచారం జరిపాడు. ఈ విషయమై పంచాయతీ పెట్టారు. నిందితుడి తరపు కుటుంబసభ్యులు తమ కుటుంబసభ్యులు చేసిన తప్పుకు క్షమాపణ కోరారు. అంతేకాదు ఈ తప్పుకు ప్రతిగా పరిహరం చేసుకొనేందుకు ఓ దుర్మార్గమైన ప్రతిపాదనను చేశారు.
బాధితురాలి సోదరుడి వద్ద నిందితుడి తరపు కుటుంబానికి చెందిన యువతిని పంపుతామని ప్రతిపాదించారు. దీనికి బాధితురాలి కుటుంబసభ్యులతో పాటు, పంచాయితీ పెద్దలు కూడ అంగీకరించారు.
బాధితురాలిపై ఎక్కడ అత్యాచారం జరిగిందో అదే ప్రాంతంలో నిందితురాలిపై అత్యాచారం చేశారు. తొలుత బాధితురాలిపై మార్చి 20వ తేదిన అత్యాచారం జరిగింది. పంచాయితీ పెద్దల తీర్పు కారణంగా ఆ మరునాడే నిందితురాలి కుటుంబానికి చెందిన యువతిపై అత్యాచారం జరిగింది.