నీళ్లు: ఏడారిలో కొడుకుని బతికించుకునేందుకు ప్రాణాలొదిలారు
న్యూమెక్సికో: ఫ్రాన్స్లో హృదయ విదారకర సంఘటన జరిగింది. ఎడారిలో ఎండ వేడికి తాళలేక తాగేందుకు నీళ్లులేక దంపతులు మృతి చెందారు. అయితే, తమ వద్ద ఉన్న కొద్దిపాటి నీటిని తాము తాగకుండా తమ కొడుకుకు తాగిస్తూ అతని ప్రాణాలు మాత్రం కాపాడగలిగారు.
ఎడారి అందాలను చూసేందుకు పర్యాటకులుగా తమ తొమ్మిదేళ్ల కొడుకు ఎంజోను కూడా తీసుకు వెళ్లారు ఆ దంపతులు. అనుకోని పరిస్థితుల్లో ఎడారి మధ్యలో చిక్కుకుపోయి, ఎండ వేడికి తాళలేక పోయారు. అప్పటికి వారి వద్ద కొద్దిగా నీళ్లు ఉన్నాయి.
అయితే, కొడుకునైనా బతికించుకుందామని, వారివద్ద ఉన్న మంచినీటిని తమ కొడుకుకు ఇచ్చి, తమ ప్రాణాలు విడిచారు. ఈ సంఘటన ఫ్రాన్స్ పరిధిలోని వైట్ శాండ్స్ ప్రాంతంలో జరిగింది. వీరి గురించి వెతుకుతూ వెళ్లిన పెట్రోలింగ్ సిబ్బందికి తండ్రి మృతదేహం పక్కనే అపస్మారక స్థితిలో బాలుడు కనిపించాడు.
తండ్రి మృతదేహం పక్కనే ఖాళీగా ఉన్న రెండు వాటర్ బాటిల్స్ కనిపించాయి. ఎంజో తల్లిదండ్రులు మంచినీటినిబాలుడి కోసం దాచి వారు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. తక్కువ నీటిని తాగినా, చిన్న పిల్లాడు కావడం వల్లే ఎంజో ప్రాణాలు దక్కాయన్నారు. వారు ప్రయాణిస్తున్న కారు ఎడారి చెడిపోయింది. అతను ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.