మోడీ, ఇండియన్స్ సూపర్: ఒబామా, బాన్ కీ మూన్
న్యూయార్క్: పారిస్ ఒప్పందానికి భారతదేశం పచ్చజెండా ఊపడంపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్ ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసలతో ముంచెత్తారు. పారిస్ ఒప్పందంపై ఒబామా ట్విట్టర్ ద్వారా స్పందించారు.
శాంతిని చాటిన మహనీయుడు, భారత జాతిపిత మహాత్మాగాంధీ బాటలో, ఆయన అడుగుజాడల్లో భారత్ ప్రధాని నరేంద్ర మోడీ, భారతదేశ ప్రజలు నడుస్తున్నారని బరాక్ ఒబామా పోస్టులో రాశారు.

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ట్విట్టర్ పోస్టుకు ప్రధాని నరేంద్ర మోడీ స్పందిస్తూ ప్రకృతిని కాపాడుకోవడం భారతీయుల లక్షణమని సమాధానం ఇచ్చారు. పారిస్ వాతావరణ ఒప్పందపత్రాలను యూఎన్ కు భారత్ అందించింది.
పత్రాలు అందినవెంటనే యూఎన్ సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ భారతీయులందరికీ ధన్యవాదాలు అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు. గ్రీన్ హోస్ వాయువులను అత్యధికంగా విడుదల చేస్తున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. పారిస్ ఒప్పందానికి భారత్ పచ్చ జెండా ఊపడంతో పారిస్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ హర్షం వ్యక్తం చేశారు. భారత్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
Trump: నువ్వేగా ఇరాన్ వార్ చేద్దామన్నావ్..! ఆయనపై నెపం నెట్టేసిన ట్రంప్..! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..!












Click it and Unblock the Notifications