పఠాన్కోట్ దాడి వెనుక షాక్:మోడీ పాక్ టూర్తో లింక్
న్యూఢిల్లీ: పంజాబ్లోని పఠాన్కోట్ ఎయిర్ బేస్ పైన ఉగ్రవాదుల దాడిలో భారత్ ఏడుగురు ధీశాలులను కోల్పోయింది. పఠాన్కోట్ దాడి వెనుక... ఎన్నో కారణాలు ఉన్నాయంటూ తాజాగా వార్తలు వస్తున్నాయి. భారత్ - పాక్ మధ్య శాంతియుత చర్చలు జరగకుండా చేయడంలో భాగంగానే ఈ దాడులు జరిగాయని భావిస్తున్నారు.
ఇందుకు సంబంధించి ఆంగ్ల మీడియాలో వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్, పాకిస్తాన్ ఇంటర్ సెర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) కలిసి పఠాన్కోట్ పైన తీవ్రవాద దాడికి ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది.
సమాచారం మేరకు... భారత్ - పాకిస్తాన్ల మధ్య శాంతియుత చర్చల విషయంలో రహీల్ షరీఫ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ అకస్సాత్తుగా పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ పుట్టిన రోజు సందర్భంగా లాహోర్లో పర్యటించారు.

ఇరువురు ప్రధానులు శాంతియుతంగా ముందుకు సాగేందుకు సిద్ధమైనట్లుగా భావించిన ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్.. దానిని జీర్ణించుకోలేకపోతున్నారని తెలుస్తోంది. ఈ కారణంగా తీవ్రవాద దాడికి ప్లాన్ చేశాడని అంటున్నారు.
పాకిస్తాన్లోని రావల్పిండిలో తీవ్రవాద దాడికి ప్లాన్ చేశారు. తద్వారా త్వరలో జరగనున్న ఇరు దేశాల కార్యదర్శుల సమావేశాన్ని కూడా భగ్నం చేయాలని వారి లక్ష్యంగా చెబుతున్నారు. ఈ దాడికి బాధ్యులమంటూ జిఈఎం ప్రకటించిన విషయం తెలిసిందే.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications