G7 Summit: జీ 7 సదస్సు వేళ మోడీ కీలక అడుగులు-మాక్రాన్, రిషీ సునాక్ తో కీలక చర్చలు..!
ఇటలీలో జరుగుతున్న జీ7 దేశాల సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ప్రధాని మోడీ ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ప్రపంచ దేశాధినేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. అసలు సదస్సుతో సంబంధం లేకుండా వీరిలో విడిగా భేటీ అవుతూ ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరుపుతున్నారు. భారత్ తో ఆయా దేశాల సంబంధాలను మెరుగుపర్చుకోవడంతో పాటు భవిష్యత్ అవసరాలపై చర్చిస్తున్నారు. ప్రధాని మోడీతో భేటీ అయిన వారిలో బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఉన్నారు.
J'ai eu une excellente réunion avec mon ami le Président @EmmanuelMacron. Il s'agit de notre quatrième rencontre en un an, ce qui indique la forte priorité que nous accordons aux liens solides entre l'Inde et la France. Nos échanges ont porté sur de nombreux sujets tels que la… pic.twitter.com/rDsy5FPCHu
— Narendra Modi (@narendramodi) June 14, 2024
ముందుగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ తో భేటీ అయిన ప్రధాని మోడీ.. ఈ భేటీలో ఇరుదేశాల సంబంధాల మెరుగుదల కోసం చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు. అలాగే పలు అంతర్జాతీయ అంశాలపైనా చర్చించినట్లు ట్వీట్ చేశారు. గత ఏడాది కాలంలో ఇది తామిద్దరి మధ్య నాలుగో భేటీ అని మోడీ తెలిపారు. భారత్-ఫ్రాన్స్ మధ్య సంబంధాల బలోపేతానికి తాము ఇస్తున్న ప్రాధాన్యతకు ఇది నిదర్శనం అన్నారు.

అలాగే మాక్రాన్ తో భేటీలో రక్షణ, భద్రత, సాంకేతికత, ఏఐ, బ్లూ ఎకానమీ, వంటి అనేక విషయాలను కవర్ చేసినట్లు ప్రధాని తెలిపారు. యువతలో ఆవిష్కరణలు, పరిశోధనలను ఎలా ప్రోత్సహించాలో కూడా చర్చించామన్నారు. వచ్చే నెలలో ప్రారంభం కానున్న పారిస్ ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇస్తున్న సందర్భంగా మాక్రాన్ కు మోడీ శుభాకాంక్షలు తెలిపారు.
Провів дуже продуктивну зустріч з Президентом Володимиром Зеленським. Індія прагне і надалі зміцнювати двосторонні відносини з Україною. Зважаючи на триваючі бойові діі, повторив, що Індія вірить у людиноцентричний підхід та вважає, що шлях до миру лежить через діалог та… pic.twitter.com/t9x4VfuuSN
— Narendra Modi (@narendramodi) June 14, 2024
అలాగే బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్ తో జరిగిన భేటీ వివరాల్ని కూడా మోడీ ఎక్స్ లో పంచుకున్నారు. ఇందులో ఇటలీలో మూడవసారి ఎన్డీయే ప్రభుత్వ హయాంలో భారత్-యుకె సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు నా నిబద్ధతను పునరుద్ఘాటించానన్నారు. సెమీకండక్టర్లు, సాంకేతికత మరియు వాణిజ్యం వంటి రంగాలలో సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి గొప్ప అవకాశం ఉందని, రక్షణ రంగంలో సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవడం గురించి కూడా మాట్లాడినట్లు మోడీ తెలిపారు.
It was a delight to meet PM @RishiSunak in Italy. I reiterated my commitment to further strengthen the India-UK Comprehensive Strategic Partnership in the third term of the NDA Government. There is great scope to deepen ties in sectors like semiconductors, technology and trade.… pic.twitter.com/ehjhFY89cE
— Narendra Modi (@narendramodi) June 14, 2024
మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో జరిగిన భేటీ వివరాలను కూడా మోడీ వెల్లడించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో చాలా మంచి సమావేశం జరిగిందని, ఉక్రెయిన్తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేసుకునేందుకు భారత్ ఆసక్తిగా ఉందని మోడీ తెలిపారు.
Had a very productive meeting with President Volodymyr Zelenskyy. India is eager to further cement bilateral relations with Ukraine. Regarding the ongoing hostilities, reiterated that India believes in a human-centric approach and believes that the way to peace is through… pic.twitter.com/XOKA0AHYGs
— Narendra Modi (@narendramodi) June 14, 2024
రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యద్ధం గురించి, భారతదేశం మానవ-కేంద్రీకృత విధానాన్ని విశ్వసిస్తుందని చర్చలు మరియు దౌత్యం ద్వారా శాంతికి మార్గమని విశ్వసిస్తుందని ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు. దక్షిణ ఇటాలియన్ ప్రాంతంలోని అపులియాలో మూడు రోజుల జీ7 సమ్మిట్లో రెండోరోజు అయిన ఇవాళ ఇండో-పసిఫిక్, ఆర్థిక భద్రత తర్వాత వలసల సమస్యలపై ప్రపంచంలోని ఏడు ప్రముఖ పారిశ్రామిక దేశాల బృందం చర్చించింది.
-
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం












Click it and Unblock the Notifications