అక్రమ వలసల వేళ- నో మోర్..: యూఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్తో మోదీ భేటీలో
Donald Trump: అమెరికాలో నివసించే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తోన్నారు. కరడుగట్టిన నేరస్తులతో సమానంగా భావిస్తోన్నారు. ఈ విషయంలో భారత్ కూడా మినహాయింపు కాదు. అన్ని దేశాలకు చెందిన అక్రమ వలసదారుల భరతం పడుతున్నారు.
ఇలాంటి పరిస్థితుల మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన చేపట్టారు. బుధవారం రాత్రి ఫ్రాన్స్ నుంచి బయలుదేరిన ఆయన భారత కాలమానం ప్రకారం.. ఈ తెల్లవారు జామున 5:15 నిమిషాల సమయంలో ఆయన వాషింగ్టన్ డీసీకి చేరుకున్నారు. మేరీల్యాండ్లోని ఆండ్రూస్ ఎయిర్బేస్లో ల్యాండ్ అయ్యారు.

ప్రవాస భారతీయులకు పలకరింపు..
అక్కడి నుంచి నేరుగా బ్లెయిర్ హౌస్కు బయలుదేరి వెళ్లారు. ఓ మోస్తరు వర్షంలోనూ జాతీయ పతాకాలను చేతబట్టుకుని బ్లెయిర్ హౌస్ వద్ద భారీ సంఖ్యలో బారులు తీరిన ప్రవాస భారతీయులను పలకరించారు మోదీ. వారితో ముచ్చట్లాడారు. ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా భారత్ మాతాకీ జై అంటూ నినదించారు ప్రవాస భారతీయులు.
యూఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్తో..
ఆ వెంటనే- యూఎస్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసీ గబ్బార్డ్తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. అమెరికా పర్యటనలో మోదీ తొలి అధికారిక సమావేశం ఇంటెలిజెన్స్ చీఫ్తో కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ భేటీకి కొన్ని గంటల ముందే ఆమె ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించడం గమనార్హం.
మోదీ- తులసీ గబ్బార్డ్ మధ్య..
ఈ సందర్భంగా మోదీ- తులసీ గబ్బార్డ్ మధ్య పలు అంశాలు చర్చకు వచ్చాయి. రెండోసారి ఆ దేశాధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలను స్వీకరించిన తరువాత అక్కడి ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాల గురించి ఆమె.. ప్రధాని మోదీకి వివరించినట్లు తెలుస్తోంది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో ప్రభుత్వ కార్యకలాపాలు సాగుతున్నాయని వివరించారని సమాచారం.
ఆర్థికం, వాణిజ్యం, డిఫెన్స్..
అలాగే - వివిధ రంగాల్లోభారత్- అమెరికా మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తోన్న సంబంధాల ప్రస్తావన సైతం వారిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు. ఆర్థికం, వాణిజ్యం, డిఫెన్స్..వంటి రంగాల్లో కుదుర్చుకోవాల్సిన ఒప్పందాలపై సూచనప్రాయంగా ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications