మిత్ర దేశాల నేతలతో మోడీ కరచాలనం (పిక్చర్స్)
అమెరికా పర్యటనలో భాగంగా ఆయన ఆదివారం శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్స, బంగ్లాదేశ్, నేపాల్ ప్రధానులు షేక్ హసీనా, సుశీల్ కొయిరాలాలతో వేర్వేరుగా భేటీ అయ్యారు. దక్షిణాసియా శిఖరాగ్ర కూటమి (సార్క్)ని మరింత బలోపేతం చేద్దామని భారత ప్రధాని నరేంద్ర మోడీ మిత్ర దేశాలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సార్క్ పోషించాల్సిన కీలక భూమికను నరేంద్ర మోడీ వారికి వివరించారు.
సభ్య దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉమ్మడి పోరుకు సిద్ధం కావాలని మోడీ పిలుపునిచ్చారు. మోడీ ప్రతిపాదనకు మూడు దేశాల అధినేతలు సానుకూలంగా స్పందించారు. ఐక్యరాజ్య సమితిలో చేసిన ప్రసంగంపై వారు మోడీని అభినందనలతో ముంచెత్తారు.
అంతక ముందు ఐక్యరాజ్యమతిలో మోడీ మాట్లాడుతూ ఐరాస, భద్రతామండలిలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. భద్రతామండలిని మరింత విస్తరించాల్సిన సమయం ఆసన్నమయిందని చెప్పారు. సభ్యదేశాలన్నీ అంతర్జాతీయ నియమాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ప్రపంచ భవితను ఏ ఒక్క దేశామో మార్చలేదని అన్నారు. ప్రతి దేశం తమ బాధ్యతలను నెరవేర్చాలని చెప్పారు.
గత 40 ఏళ్లుగా భారత్ ఉగ్రవాద సమస్యను ఎదుర్కొంటోందని చెప్పారు. ఉగ్రవాదాన్ని కలసి కట్టుగా ఎదుర్కోవడానికి తాము పాక్ తో చేతులు కలపడానికి కూడా సిద్ధమయ్యామని తెలిపారు. పాకిస్థాన్ తో స్నేహ సంబంధాలనే కోరుకుంటున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. పాక్ కూడా తనవైపు నుంచి అదే రీతిలో సహకారం అందించాలని కోరారు.

మిత్ర దేశాల నేతలతో మోడీ కరచాలనం
ఐక్యరాజ్యమతిలో మోడీ మాట్లాడుతూ ఐరాస, భద్రతామండలిలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. భద్రతామండలిని మరింత విస్తరించాల్సిన సమయం ఆసన్నమయిందని చెప్పారు.

మిత్ర దేశాల నేతలతో మోడీ కరచాలనం
ఐక్యరాజ్య సమితిలో చేసిన ప్రసంగంపై వారు మోడీని అభినందనలతో ముంచెత్తారు. అంతక ముందు ఐక్యరాజ్యమతిలో మోడీ మాట్లాడుతూ ఐరాస, భద్రతామండలిలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు.

మిత్ర దేశాల నేతలతో మోడీ కరచాలనం
భద్రతామండలిని మరింత విస్తరించాల్సిన సమయం ఆసన్నమయిందని చెప్పారు. సభ్యదేశాలన్నీ అంతర్జాతీయ నియమాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ప్రపంచ భవితను ఏ ఒక్క దేశామో మార్చలేదని అన్నారు. ప్రతి దేశం తమ బాధ్యతలను నెరవేర్చాలని చెప్పారు.

మిత్ర దేశాల నేతలతో మోడీ కరచాలనం
అమెరికా పర్యటనలో భాగంగా ఆయన ఆదివారం శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్స భేటీ అయ్యారు.

మిత్ర దేశాల నేతలతో మోడీ కరచాలనం
అమెరికా పర్యటనలో భాగంగా ఆయన ఆదివారం బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భేటీ అయ్యారు.

మిత్ర దేశాల నేతలతో మోడీ కరచాలనం
అమెరికా పర్యటనలో భాగంగా ఆయన ఆదివారం నేపాల్ ప్రధాని సుశీల్ కొయిరాలాలతో భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications