డొక్లాం భారత్కు అవసరం లేదుగా అంటున్నారు కానీ, యుద్ధం కాదు: చైనా
భారత దేశంపై మిలిటరీ చర్యకు డిమాండ్ చేసిన వారిపై చైనా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. డొక్లాం వివాదం రెండు నెలలకు పైగా కొనసాగిన విషయం తెలిసిందే.
బీజింగ్: భారత దేశంపై మిలిటరీ చర్యకు డిమాండ్ చేసిన వారిపై చైనా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. డొక్లాం వివాదం రెండు నెలలకు పైగా కొనసాగిన విషయం తెలిసిందే.
చదవండి: గోతి తవ్వుకుంటున్నారు, మాతో సరితూగలేరు, ఏం సాధిస్తారు?: భారత్-జపాన్ మైత్రిపై చైనా అక్కసు
చివరకు.. ఇరు దేశాలు సైన్యాన్ని తొలగించాల్సిందేనని మొదటి నుంచి చెబుతూ వచ్చిన భారత్ తన మాటను నెగ్గించుకుంది. ఈ నేపథ్యంలో డొక్లామ్ అనంతరం భారత్కు సైనిక చర్యకు డిమాండ్ చేసిన వారిపై చైనా అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.
చదవండి: చైనాకు డొక్లామ్ దెబ్బ: వేగంగా మార్పులు, భారత్కు జపాన్ బుల్లెట్ ట్రెయిన్

భారత్ను వ్యతిరేకిస్తున్న వారికి
చైనా ప్రభుత్వ అభిప్రాయాలు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మేజర్ జనరల్ కియావో లియాంగ్ ద్వారా వెల్లడయ్యాయి. భారత్ను వ్యతిరేకిస్తున్న వారికి చైనా వ్యూహాత్మక వైఖరి గురించి సరైన అవగాహన లేదని లియాంగ్ ఓ వ్యాసంలో దుయ్యబట్టడమే ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు.

భారత్తో ఒప్పందం ఎందుకు?
చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్లో మేజర్ జనరల్ కియావో లియాంగ్ ఓ వ్యాసం రాశారు. ఆయన సైనిక వ్యూహకర్త కూడా. డొక్లాం విషయంలో భారత్కు గట్టి బుద్ధి చెప్పకుండా ఒప్పందం ఎందుకు కుదుర్చుకున్నారని కొందరు చైనా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు.

పరిష్కారమవ్వాల్సిన విధంగానే
ఈ నేపథ్యంలో ఆయన రాసిన వ్యాసంలో చైనా, భారతదేశం పొరుగు దేశాలు, పోటీదారులు, అయితే అందరు పోటీదారులను కఠినంగా చూడవలసిన అవసరం లేదని ఆయన తన వ్యాసంలో పేర్కొన్నారు. డొక్లాం ప్రతిష్టంభన పరిష్కారమవ్వాల్సిన విధంగానే పరిష్కారమైందన్నారు. శాంతి మాత్రమే ఉత్తమమైనదని, దేశాన్ని యుద్ధంలోకి నెట్టకుండా నిరోధించేందుకు చేయవలసినదంతా చేయాలన్నారు.

సరైనది సరైన సమయంలో చేయాలి
చైనా భూభాగంలో రోడ్డు నిర్మాణంతో భారత్కు ఏం పని అని చాలామంది అంటారని, ఇది నిజమేనా? ఇది కొంత వరకు సమంజసమేనని, ఎందుకంటే, ఈ ప్రాంతంలో రోడ్డు నిర్మాణమే తప్పొప్పులకు సంబంధించినది కాదని, అయితే సరైన దానిని ఏ సమయంలోనైనా చేయడమనేది ఎల్లప్పుడూ సరైనది కాదని అర్థం చేసుకోవాలని, సరైన దానిని సరైన సమయంలో చేయడం మాత్రమే సరైనదని పేర్కొన్నారు.

యుద్ధం అంటున్నారు కానీ
చైనా శక్తిని యుద్ధం మాత్రమే వెల్లడించగలదని చాలామంది అనుకుంటున్నారని, అయితే యుద్ధం చేయడం బాధ్యతారాహిత్యమని ఆయన పేర్కొన్నారు. యుద్ధం లేకుండా సమస్యను పరిష్కరించుకునే అవకాశమున్నపుడు, యుద్ధాన్ని నివారించాలన్నారు. ప్రస్తుతం చైనా మన దేశంతో వ్యాపార సంబంధాలను అభివృద్ధి చేసుకోవడంపై దృష్టి సారించిందన్నారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications