గోతి తవ్వుకుంటున్నారు, మాతో సరితూగలేరు, ఏం సాధిస్తారు?: భారత్-జపాన్ మైత్రిపై చైనా అక్కసు
భారత్-జపాన్ మధ్య సంబంధాలు బలపడటం చైనాకు ఇప్పుడు కంటగింపుగా మారింది. బుల్లెట్ రైలు ప్రాజెక్టు తమకు దక్కలేదన్న అసహనాన్ని చైనా పరోక్షంగా బయటపెట్టుకుంది.
న్యూఢిల్లీ: అత్యాధునిక బుల్లెట్ ట్రెన్స్ ను ప్రవేశపెట్టడం ద్వారా భారతీయ రవాణా వ్యవస్థ ముఖచిత్రాన్ని సంపూర్ణంగా మార్చివేయాలని ఎన్డీయే సర్కార్ భావిస్తోంది.
బుల్లెట్ ట్రైన్ టెక్నాలజీకి కేరాఫ్ అయిన జపాన్.. ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన రైల్వే నెట్ వర్క్ కలిగి ఉండటంతో.. భారత్ లో చేపట్టబోయే బుల్లెట్ ప్రాజెక్టును ఆ దేశానికే అప్పగించింది.

రూ.1,10,000 కోట్ల నిర్మాణ వ్యయంతో 2023కల్లా ప్రాజెక్టు పూర్తి చేయడానికి జపాన్-ఇండియాల మధ్య ఒప్పందం కుదిరింది. ఇందుకు అవసరమయ్యే ఖర్చులో 88వేల కోట్ల రుణాన్ని జపానే మంజూరు చేయనుంది. వచ్చే 50ఏళ్లలో 0.1శాతం వడ్డీతో ఈ రుణాన్ని భారత్ తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
ఈ ప్రాజెక్టుతో భారత్-జపాన్ మధ్య సంబంధాలు బలపడటం చైనాకు ఇప్పుడు కంటగింపుగా మారింది. ప్రాజెక్టు తమకు దక్కలేదన్న అసహనాన్ని పరోక్షంగా బయటపెట్టుకుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ, జపాన్ ప్రధాని అబెల కలయికపై అక్కసు వెళ్లగక్కింది. బుల్లెట్ రైళ్ల విషయంలో ఈ ఇద్దరు తమ గోతిని తామే తవ్వుకుంటున్నారని చైనా అధికారిక వార్తా పత్రిక గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.
ఆసియాలోని ఏ దేశం కూడా సాంకేతికంగాను, జాతీయ భద్రత విషయంలోను చైనాతో సరితూగలేవని చెప్పింది. వేగంగా అబివృద్ధి చెందుతున్న ఆసియా ఖండంలో.. ఎవరు ముందుగా గమ్యాన్ని చేరితే వారే విజేతలవుతారని స్పష్టం చేసింది. ఇందులో ఆర్థిక, సాంకేతిక, రక్షణ రంగాల్లో ఇప్పటికే చైనా తిరుగులేని శక్తిగా ఆవిర్భవించిందని చెప్పుకొచ్చింది. ఇప్పుడు కొత్తగా భారత్-జపాన్లు ఏం సాధించగలవని చులకన వ్యాఖ్యలు చేసింది.
ఆసియాలోనే అత్యంత సంకుచితమైన తత్వం జపాన్ దేశానిదని, భారత్-చైనా కలిసినంత మాత్రానా తమకొచ్చిన నష్టమేమి లేదని స్పష్టం చేసింది.
-
Video: మెట్రోలో రక్తపు వాంతులు, ప్రపంచాన్ని కదిలించిన దృశ్యం! -
ఏడాదికే గ్రాట్యుటీ.. ఐదేళ్ల నిరీక్షణకు చెక్ -
కొత్త ఫోన్ లాంఛ్ చేసిన "Honor".. కిర్రాక్ ఫీచర్స్ ! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి












Click it and Unblock the Notifications