పుతిన్ ఇంటిపై ఉక్రెయిన్ దాడి..! ప్రధాని మోడీ రియాక్షన్ ఇదే..!
రష్యా-ఉక్రెయిన్ మధ్య సుదీర్ఘంగా సాగుతున్న యుద్ధంలో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ కు చెందిన ఉత్తర మాస్కోలోని నోవ్ గరాడ్ ఓబ్లాస్ట్ నివాసంపై ఉక్రెయిన్ ఏకంగా 90కి పైగా డ్రోన్లతో విరుచుకుపడింది. అయితే వీటిని సకాలంలో అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పిందని రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లావ్రోవ్ ఇవాళ ప్రకటించారు. దీంతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ చర్యను ఖండించారు.
ఈ నేపథ్యంలో రష్యాకు సన్నిహిత మిత్రదేశమైన భారత్ ఇవాళ స్పందించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటిపై జరిగిన దాడి తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ప్రధాని మోడీ తెలిపారు. రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుడి నివాసాన్ని లక్ష్యంగా చేసుకున్నారనే నివేదికలతో తీవ్ర ఆందోళన చెందుతున్నానని మోడీ ట్వీట్ చేశారు. ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న దౌత్య ప్రయత్నాలు శత్రుత్వాలను అంతం చేయడానిక, శాంతిని సాధించడానికి ఆచరణీయమైన మార్గాన్ని అందిస్తాయన్నారు. ఈ ప్రయత్నాలపై దృష్టి పెట్టాలని, వాటిని దెబ్బతీసే చర్యలను నివారించాలని ఇరుపక్షాల్నీ మోడీ కోరారు.

Deeply concerned by reports of the targeting of the residence of the President of the Russian Federation. Ongoing diplomatic efforts offer the most viable path toward ending hostilities and achieving peace. We urge all concerned to remain focused on these efforts and to avoid any…
— Narendra Modi (@narendramodi) December 30, 2025
అయితే పుతిన్ ఇంటిపై దాడి వార్తల్ని ఉక్రెయిన్ ఖండించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఈ కథనాలు పూర్తిగా కల్పితమని అభివర్ణించారు. ట్రంప్ టీమ్ తో తమ ఉమ్మడి దౌత్య ప్రయత్నాల విజయాలన్నింటినీ అణగదొక్కడానికి ప్రమాదకరమైన ప్రకటనలను ఉపయోగించవద్దని ఆయన హెచ్చరించారు. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా అంతర్జాతీయ సమాజాన్ని నిర్మాణాత్మక శాంతి ప్రక్రియను పట్టాలు తప్పించే లక్ష్యంతో రెచ్చగొట్టే రష్యన్ ప్రకటనలను ఖండించాలని కోరారు. ఉక్రెయిన్ రష్యన్ భూభాగంలోని చట్టబద్ధమైన సైనిక స్థావరాలను మాత్రమే తాము లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు.
-
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత












Click it and Unblock the Notifications