భారత్ను ట్రంప్ నిర్లక్ష్యం చేస్తున్నారు, మోడీ మాత్రం..: అమెరికా మాజీ అధికారి
వాషింగ్టన్: అమెరికాతో భారత ప్రధాని నరేంద్ర మోడీ మంచి సంబంధాలు కోరుకుంటున్నారని, కానీ అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ నిర్లక్ష్యం చేస్తున్నారని అమెరికా మాజీ దౌత్యాధికారి వెల్లడంచారు. భారత్ విషయంలో ట్రంప్ చాలా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు.
అమేజింగ్ వీడియో!: విమానం నుంచి సరస్సులోకి చేపల వర్షం, ఎందుకంటే?
భారత్తో సంబంధాల విషయంలో మాజీ అధ్యక్షులు జార్డి డబ్ల్యు బుష్, బరాక్ ఒమామాల మాదిరిగా ట్రంప్ ఆసక్తి చూపించడం లేదని భారత్లో అమెరికా రాయబారిగా పని చేసిన టిమ్ రోమర్ తెలిపారు. ఇరు దేశాల భవిష్యత్తు చాలా ప్రకాశవంతంగా ఉంటుందని, భారత్తో సంబంధాల విషయంలో అమెరికా ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నాలు చేయాలన్నారు. ప్రధాని మోడీ అమెరికాతో సంబంధాలు బలపరుచుకునే విషయంలో చాలా ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు. మోడీ అమెరికా వచ్చినప్పుడు అవగాహనతో వ్యవహరించారని చెప్పారు. ట్రంప్ యంత్రాంగం భారత్ విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఇరు దేశాల మధ్య సంబంధాలు క్లిష్టంగా మారుతాయన్నారు.