నీటి కటకట: వలస బాట పట్టిన కొండ చిలువలు
సిడ్నీ: తాగు నీరు కరువై మనుషులు వలసలు వెళ్లిన విషయం తెలిసిందే. విదేశాలలో తాగు నీరు కరువై పక్షులు వలసలు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే కొండ చిలువలు తాగు నీరు చిక్కక ఇండ్లలోకి చొరబడుతున్నాయి.
ఆస్ట్రేలియాలోని పలు చోట్ల ఇప్పుడు ఎక్కడపడితే అక్కడ కొండచిలువలు ఇళ్లల్లోకి చోరబడి తాగు నీరు కోసం అక్కడే మకాం వేస్తున్నాయి. అయితే వాటి వలన హాని జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆస్ట్రేలియాలోని క్వీన్స్ లాండ్ లో చాల కాలంగా వర్షాలు కరువయ్యాయి. క్వీన్స్ లాండ్ ప్రాంతంలో వడగాలులు ఎక్కువ అయ్యాయి. క్వీన్ లాండ్ లో పాములు ఎక్కుగా ఉన్నాయి. నీరు లేకపోవడంతో పాములు ఇళ్లలోకి వలసబాట పట్టాయి.
టౌన్స్ విల్లేలోని ఓ ఇంటి కిచెన్ సింక్ లో, టాయిలెట్ లో, మురికి నీరు పారే పైపులలో రెండు వారాల పాటు భారీ సంఖ్యలో కొండ చిలువలు చేరిపోయాయి. విషయం గుర్తించిన ఇంటి యాజమాన్యం పాములు పట్టేవారిని పిలిపించి వాటిని బంధించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.