‘భారత్తో చర్చల్ని కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయి’
ఇస్లామాబాద్: భారత్-పాకిస్థాన్ దేశాల శాంతి చర్చల్ని కొన్ని శక్తులు అడ్డగిస్తున్నాయని పాక్ రక్షణ మంత్రి కవాజా మహ్మద్ ఆసిఫ్ ఆరోపించారు. ఆయన బుధవారం పాకిస్థాన్ రేడియోలో మాట్లాడుతూ.. ఉగ్ర దాడుల ద్వారా ఆ శక్తులు శాంతి చర్చలు జరగకుండా అడ్డుపడుతున్నాయని అన్నారు.
అయితే వారు తమను ఎంతో కాలం అలా నిలువరించలేరని చెప్పారు. పఠాన్కోట్ ఉగ్రదాడి తర్వాత పాక్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్.. భారత ప్రధాని నరేంద్ర మోడీలు ఫోన్లో సంభాషించుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
వారి సంభాషణే ఇరు దేశాల మధ్య ఉన్న సహృద్భావ వాతావరణానికి నిదర్శనమన్నారు. పాకిస్థాన్ కూడా ఉగ్రవాద పీడిత దేశమని దాని మీద ఎప్పుడూ యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉంటామని చెప్పారు.

పఠాన్కోట్ ఎయిర్బేస్పై ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో ఏడుగురు భారత సైనిక అధికారులు మృతి చెందిన విషయం తెలిసిందే. సైన్యం కాల్పుల్లో దాడికి పాల్పడిన ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
కాగా, ఆ ఉగ్రవాదులు పాకిస్థాన్ ప్రేరేపిత, కాందహార్ హైజాక్ ఘటనకు పాల్పడిన మౌలానా మసూద్ అజ్మర్ నాయకత్వంలోని జైషే ఈ మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాదులేనని ఆరోపణలున్నాయి.
-
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ప్రపంచంలోనే తొలి స్థానంలో పాకిస్థాన్.. ఆ ఒక్క విషయంలో.. -
ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ ? తెరపైకి సౌదీతో రక్షణ ఒప్పందం..! -
లష్కరే తోయిబా ఉగ్రవాది హత్య.. చంపేసింది సొంత కుటుంబ సభ్యులే! -
viral video: ధురంధర్-2 చూసిన పాకిస్థాన్ ఫ్యామిలీ.. భారత్ కు వార్నింగ్..?? -
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్కు తాకట్టు -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..!











Click it and Unblock the Notifications