వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వర్ణ వివక్ష పోరాట యోధుడు ఆర్చ్ బిషప్ డెస్మండ్ టుటు కన్నుమూత

|
Google Oneindia TeluguNews

జోహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షకు వ్యతిరేకంగా అవిశ్రాంత పోరాటం చేసిన హక్కుల కార్యకర్త, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, ఆర్చ్ బిషప్ డెస్మండ్ టుటు(90) ఆదివారం కన్నుమూశారు. టుటు కుటుంబసభ్యులతోపాటు దేశ అధ్యక్షుడు సిరిల్ రామఫోసా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

'ఈ ఉదయం కేప్ టౌన్ లోని ఒయాసిస్ ఫ్ట్రైల్ కేర్ సెంటర్‌లో టుటు తుది శ్వాస విడిచారు' అని ఆయన కుటుంబసభ్యులు ఒక ప్రకటనలో వెల్లడించారు. అయితే, మృతికి గల కారణాలు తెలియజేయలేదు. దక్షిణాఫ్రికా విముక్తి కోసం పోరాడిన గొప్ప వ్యక్తుల్లో మరొకరిని కోల్పోయామన్న అధ్యక్షుడు రామఫోసా.. టుటుతో కలిసి ఉన్న ఫొటోను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

South Africa: Anti-apartheid Icon, Archbishop Desmond Tutu Passes Away Aged 90

జోహన్నెస్‌బర్గ్ కు మొదటి నల్లజాతి బిషప్‌గా, తర్వాత కేప్ టౌన్ ఆర్చ్ బిషప్‌గా ఆయన వ్యవహరించారు. 1997లో ఆయనకు ప్రొస్టేట్ క్యాన్సర్ నిర్ధారణ అయ్యింది. కొన్నేళ్లుగా ఆయన చికిత్స తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు.

కాగా, దక్షిణాఫ్రికా నైతిక దిక్సుచిగా పేరుపొందారు డెస్మంటు టుటు. 1980ల్లో స్థానికంగా నల్ల జాతీయులపై క్రూరమైన అణిచివేత పాలనకు, జాతి వివక్షతకు వ్యతిరేకరంగా పోరాడిన ప్రముఖుల్లో టుటు ఒకరు. ఎల్జీబీటీల హక్కుల కోసం కూడా ఆయన పోరాటం చేశారు. ఆయన అహింసాయుత పోరాటానికి గుర్తింపుగా 1984లో నోబెల్ శాంతి పురస్కారం దక్కింది.

English summary
South Africa: Anti-apartheid Icon, Archbishop Desmond Tutu Passes Away Aged 90.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X