ఐఎస్ మారణహోమం: 300మందిని నరికేశారు
డెమాస్కస్: ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు మరోసారి మారణహోమం సృష్టించారు. సిరియా భూభాగాలపై పట్టుకోసం, భారీ నర మేధానికి ఒడిగట్టారు. తూర్పుమధ్య నగరం దేరె-ఇల్-జార్లో ఒక్కరోజే 300మందికిపైగా పౌరులను నరికి చంపారు. పిల్లలు, మహిళలు, వృద్ధులు సహా కనిపించినవారినల్లా అత్యంత దారుణంగా చంపేశారు.
అంతేగాక, బందీల తలలు నరికి నదిలోకి విసిరేశారు. ఉగ్రవాదుల నుంచి పట్టణాన్ని, ప్రజలను కాపాడేందుకు ప్రయత్నించిన సైనికులను కూడా దారుణంగా చంపారు. సుమారు 400మంది పౌరులను బందీలుగా పట్టుకొన్నారు.
‘దేరె-ఇల్-జార్'.. ఉగ్రవాదుల పరంకాకుండా సిరియా సైన్యంతో పాటు మిలీషియా, పౌరులు సాయుధులై ఉగ్రవాదులతో తలపడ్డారు. దీంతో నగరంలోని ప్రతి వీధిలో భీకర పోరు దృశ్యాలు కనిపించాయి.

ఊహించని ప్రతిఘటనతో ఉగ్రవాదులు తొలుత తత్తరపడ్డారు. ఆ వెంటనే ఉన్మాదులుగా మారి నేరుగా పౌరులపైకి రోజంతా విచ్చలవిడిగా కాల్పులు సాగించారు. ఉగ్రవాదులు విజృంభించిన ప్రతి వీధిలో పదుల సంఖ్యలో మృతదేహాలు గుట్టలు పడ్డాయి. ఐఎస్ ఉగ్రవాదులు దేరె-ఇల్-జార్ని చెరబట్టారని ప్రభుత్వ వార్తాసంస్థ ‘సనా' తెలిపింది.
ప్రధానంగా ప్రభుత్వ అనుకూల శ్రేణులు, సైన్యాన్ని తాము చంపినట్టు ఐఎస్ ఉగ్రవాదులు చెబుతుండగా, మృతుల్లో అత్యధికులు పిల్లలు, మహిళలు, వృద్ధులేనని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నరమేధంలో 300 మందికిపైగా మరణించినట్టు నిర్ధారించాయి.
అయితే, 80 మంది జవాన్లు, ప్రభుత్వ అనుకూల మిలీషియాసహా 135 మంది మరణించినట్టు బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తున్న సిరియన్ మానవ హక్కుల పర్యవేక్షణ సంఘం వెల్లడించింది.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్కు రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications