సౌదీ అరేబియాలో 47 మందిని ఉరి తీశారు
రియాద్: ప్రముఖ మత గురువు షేక్ నిమిర్ ఆల్ నిమిర్ తో సహా 47 మందికి శనివారం ఉరి శిక్ష అమలు చేశామని సౌదీ అరేబియా హోం మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే 47 మందికి ఉరి శిక్ష అమలు చేసింది.
ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడేవారికి కచ్చితంగా ఉరి శిక్ష అమలు చేస్తామని సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రకటించింది. 2003-2006 మధ్య కాలంలో ఆల్ ఖైదాతో సంబంధాలు కొనసాగిస్తూ ఉగ్రదాడులకు పాల్పడిన నిందితులకు ఈ శిక్ష అమలు చేశామని సౌదీ అరేబియా ప్రభుత్వం తెలిపింది.

2015వ సంవత్సరంలో 158 మందికి పైగా మరణ శిక్ష అమలుచేశామని సౌదీ ప్రభుత్వ అధికారి స్థానిక మీడియాకు చెప్పారు. కేవలం నవంబర్ నెలలో 45 మంది విదేశీయులతో సహ 63 మందికి ఉరి శిక్ష అమలు చేశారు.
మాదకద్రవ్యాల రవాణా, డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని ఆరోపిస్తూ వారిని అరెస్టు చేశామని, నేరం చేశారని రుజువు కావడంతో మరణ శిక్ష పడిందని అన్నారు. 1995లో సౌదీ అరేబియాలో అత్యధికంగా 192 మందికి ఉరి శిక్ష అమలు చేశారు.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications