వారిమధ్య విభేదాలు ప్రపంచ వృద్ధికి గుదిబండలు..!ఐఎంఎఫ్ అధ్యక్షురాలు క్రిస్టిన్ లాగార్డే వ్యాఖ్య..!!
పారిస్/హైదరాబాద్ : అమెరికా, చైనా దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య పరమైన సమస్యలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా వాటిల్లనున్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) అధ్యక్షురాలు క్రిస్టిన్ లాగార్డే ఆందోళన వ్యక్తంచేశారు. పారిస్లో నిర్వహించిన పారిస్ ఫోరం కార్యక్రమానికి హాజరైన ఆమె ఓ మీడియా సమావేశంలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. చైనా నుంచి అమెరికాకు వస్తున్న దిగుమతులపై ప్రస్తుతం ఉన్న 10 శాతం సుంకాన్ని ఏకంగా 25 శాతానికి పెంచుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన ప్రపంచ మార్కెట్లను ఒక్కసారిగా కుదిపేసిందన్నారు.

మరోవైపు ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలున్న రెండు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధ ప్రభావం ప్రపంచ మార్కెట్లపై భారీగా పడుతుందని కార్యక్రమంలో పాల్గొన్న ఫ్రాన్స్ ఆర్థిక మంత్రి బ్రూనో లీ మెయిర్ హెచ్చరించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ప్రగతిని బలహీనపరిచే విధంగా నిర్ణయాలు తీసుకోవడం మానేయాలన్నారు. అధిక మొత్తంలో సుంకాలు పెంచడం అనేది ఒక వ్యవస్థ పతనం వైపుపకు పయనిస్తుందని చెప్పడానికి ఒక సంకేతం లాంటిదని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి నిర్ణయాలు కేవలం ఒక దేశానికి మాత్రమే పరిమితం కాకుండా మొత్తం ప్రపంచ వృద్ధిని అడ్డుకునేలా ఉంటాయని బ్రూనో హెచ్చరించారు. చైనా ఎగుమతులపై అధిక మొత్తంలో సుంకాలు పెంచిన నేపథ్యంలో అమెరికా వాణిజ్య విభాగంతో ఈ విషయమై చర్చించేందుకు గాను ఈ వారం చైనా నుంచి ఓ బృందం అమెరికా వెళ్లనున్నట్లు చైనా మంగళవారం ప్రకటించింది.
-
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్!












Click it and Unblock the Notifications