USA: యథేచ్ఛగా కాల్పులు- రక్తమోడిన బర్త్ డే ఫంక్షన్.. దారుణం
అమెరికాలో మరోసారి తుపాకీ పేలింది. కాలిఫోర్నియాలో తాజాగా కాల్పుల ఉదంతం చోటు చేసుకుంది. ఫ్యామిలీ బర్త్ డే పార్టీపై యథేచ్ఛగా కాల్పులు జరిపారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. 10 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. కాల్పులు జరిగిన ప్రదేశం మొత్తం కూడా బాధితుల ఆర్తనాదాలతో నిండిపోయింది.
అమెరికా కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో కాలిఫోర్నియా ఉత్తర ప్రాంతంలోని స్టాక్టన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్టాక్టన్లో నివాసం ఉంటోన్న ఓ కుటుంబం స్థానికంగా ఓ ఫంక్షన్ హాల్ లో ఈ సెలెబ్రేషన్స్ ను ఏర్పాటు చేసింది. లూసిల్ అవెన్యూలోని 1900 బ్లాక్లో ఉందీ ఫంక్షన్ హాల్. వారి బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో దీనికి హాజరయ్యారు.

పార్టీ జోరుగా సాగుతున్న వేళ హఠాత్తుగా సాయుధులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అప్పటివరకు కోలాహలంగా కనిపించిన ఆ ప్రదేశం అంతా కూడా రక్తసిక్తమైంది. బాధితుల హాహాకారాలతో మార్మోగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సమాచారం అందిన వెంటనే శాన్ జోక్విన్ కౌంటీ షెరీఫ్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు.
పిల్లలు, మహిళలతో స్టాక్టన్లో నివాసం ఉంటోన్న పలువురు ఈ ప్రైవేట్ ఫంక్షన్ కు హాజరయ్యారని, బుల్లెట్ గాయాలయిన వారిలో పిల్లలు కూడా ఉన్నారని షెరీఫ్ ప్రతినిధి హీథర్ బ్రెంట్ తెలిపారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించామని, ఈ కాల్పుల వెనుక ఉద్దేశ్యం ఇంకా స్పష్టంగా తెలియరాలేదని అన్నారు. ఇది యాదృచ్ఛికంగా జరిగినట్టుగా భావించట్లేదని పేర్కొన్నారు. దర్యాప్తు ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. అధికారులు ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.
🚨 BREAKING: Numerous Emergency crews are on scene of a major Mass shooting at a birthday as multiple children have been shot with fatalities
— The Surreal D2 (@d2wuzup) November 30, 2025
4 confirmed dead and as many as 19 injured.
Pray for Stockton. 😢🙏
#Stockton | #California https://t.co/Eg33ahyRUW
ఈ విషాదానికి దారితీసిన పరిస్థితులను తెలుసుకోవడానికి డిటెక్టివ్లు చురుకుగా పనిచేస్తున్నారని, ఈ ఘటనలో బాధితులు, వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తోన్నామని హీథర్ బ్రెంట్ పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం, వీడియో ఫుటేజ్ లేదా ప్రత్యక్షంగా చూసిన వారు ఎవరైనా వెంటనే శాన్ జోక్విన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు.
-
ఇరాన్ నష్టం రోజుకు రూ. 4,000 కోట్లు పైమాటే -
అమెరికాలో ‘తెలుగు’ అందాలు: చిలకలూరిపేట చిన్నది Vs కరీంనగర్ క్వీన్ -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!!












Click it and Unblock the Notifications