జంట పేలుళ్లతో వణికిన కాబూల్ : 50 మందికి పైగా మృతి?
ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు మరోసారి రెచ్చిపోయారు. ఏకంగా జాతీయ పార్లమెంటు సమీపంలోనే జంట పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ పేలుళ్లలో 50 మందికి పైగానే మరణించగా, పలువురు క్షతగాత్రులైనట్లు పోలీసుల ప్రాథమిక అంచనా.
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు మరోసారి రెచ్చిపోయారు. ఏకంగా జాతీయ పార్లమెంటు సమీపంలోనే జంట పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ పేలుళ్లలో 50 మందికి పైగానే మరణించగా, పలువురు క్షతగాత్రులైనట్లు పోలీసుల ప్రాథమిక అంచనా.
మరోవైపు ఈ జంట పేలుళ్లు తమ పనేనంటూ ఆఫ్ఘాన్ తాలిబన్లు ప్రకటించారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రధాన నిఘా సంస్థ అయిన ఎన్ డీ ఎస్ నుంచి సిబ్బందితో వెళ్తున్న మినీ బస్సు లక్ష్యంగా ఈ దాడి జరిగింది.
కార్మికులు ఇళ్ళకు తిరిగి వెళ్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అధికార వర్గాల సమాచారం. చాలాకాలం నుంచి ప్రశాంతంగా ఉంటున్న ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ లో హఠాత్తుగా జరిగిన ఈ దాడితో ఒక్కసారిగా కలకలం రేగింది.

బాగా రద్దీగా ఉండే ప్రాంతాన్నే ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. దారుల్ అమన్ ప్రాంతంలో ఒక ఆత్మాహుతి బాంబర్ తనను తానె పేల్చేసుకున్నాడని అధికారులు తెలిపారు.
నిజానికి ఆఫ్ఘానిస్తాన్ పార్లమెంటు భావన నిర్మాణానికి భారత దేశమే సాయం చేసింది. మొదటి పేలుడు జరిగిన తర్వాత కొద్దిసేపటికే మరో కారు బాంబు పేలడంతో స్థానికులు భయాందోళనలకు గురైనట్లు అధికారులు చెప్పారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications