ఫిలిప్పీన్స్లో రాయ్ టైపూన్ విద్వంసం..100 మంది మృతి..అంధకారంలో 227 నగరాలు
ఫిలిప్పీన్స్లో టైపూన్ రాయ్ తుపాను విద్వంసం సృష్టించింది. గంటలకు 195 నుంచి 270 కిలోమీటర్ల వేగంతో వీచిన పెనుగాలులకు చికురుటాకులా వణికింది. 227 నగరాలతో పాటు గ్రామాలను అంధకారంలోకి నెట్టింది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పలువురి ఆచూకీ గల్లంతైంది. మృతులు సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆ దేశ అధికారులు వెల్లడించారు.

బీభత్సం సృష్టించిన టైపూన్ రాయ్
టైపూన్ రాయ్ సృష్టించిన బీభత్సం దాటికి ఇళ్లు, భారీ వృక్షాలు నేలమట్టమయ్యాయి. కోలుకోలేని పరిస్థితి నెలకొంది. భారీ వర్షాలకు వరదులు ముంచేత్తడంతో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. వరదల్లో ఇళ్లు , కార్లు కొట్టకపోయాయి. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తోందోనని జనం బిక్కుమని కాలం గడుపుతున్నారు. పెనుగాలుల దాటికి విద్యుత్ వ్యవస్థ, కమూనికేషన్ వ్యవస్థ విద్వంసం అయింది. దాదాపు దేశం మొత్తం అంధకారంలోకి నెట్టింది.

నిరాశ్రయులైన మూడు లక్షల మంది ప్రజలు
రామ్ తుపాన్ ప్రభావంతో దాదాపు 3లక్షల మంది నిరాశ్రయులయ్యారు. వారందరిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బోహూల్ ద్వీపంలోనే ఇప్పటి వరకు 49 మంది మృతి చెందారని ఆ ప్రావిన్స్ గవర్నర్ ఆర్థర్ యాప్ తెలిపారు. మరో పది మంది గల్లంతైనట్లు వెల్లడించారు. బోహోల్ ప్రావిన్స్ లో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ తుపాను సుమారు 8 లక్షల మందిపై ప్రభావం పడింది.

ఇబ్బందులు పడుతున్న పర్యాటకలు
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు. దీని కోసం మిలటరీ, కోస్టు గార్డు, పోలీసు, అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దింపినట్లు చెప్పారు. రాయ్ తుపాను అత్యంత విధ్వంసం సృష్టించిన బోహుల్, సియార్గావ్, మిన్డనరవ్, డినాగట్ ద్వీపాలలో ప్రజలకు అవసరమైన నిత్యావసరాలు, పునరావాస సామాగ్రిని తరలించినట్లు వెల్లడించారు. పర్యాటక ప్రదేశమైన ఫిలిప్పిన్స్లో క్రిస్మస్ సంబరాలను జరుపుకునేందుకు విదేశాల నుంచి వచ్చిన పర్యాటకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఏటా సగటున 20 తపాన్లు..
ప్రతి ఏటా ఫిలిప్పీన్స్ లో సగటున 20 తఫాన్లు సంభవిస్తుంటాయి. ఈ దేశంలో మొత్తం 7460 దీవులు ఉన్నాయి. 2013లో హైయన్ టైపూన్ ఆ దేశాన్ని వణికించింది. ఈ తుపాను దాటికి సుమారు 7300 మంది మృతి చెందారు. తాజా సంభవించిన తుపాను బీభత్సం సృష్టించింది. లక్షలాది మందిని నిరాశ్రయులను చేసింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications