గాల్వాన్ వ్యాలీ ఘటనపై యూఎన్ చీఫ్ ఆందోళన, సమన్వయం పాటించాలని సూచన..
తూర్పు లడాఖ్ వద్ద గల గాల్వాన్ వ్యాలీ వద్ద చైనా-భారత్ భద్రతా దళాల మధ్య జరిగిన ఘర్షణపై ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఘర్షణలో 20 మంది భారత జవాన్లు, చైనాకు చెందిన 43 మంది చనిపోయారు. ఘటనపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇరుదేశాలు సమన్వయం పాటించాలని మంగళవారం రాత్రి కోరినట్టు యూఎన్వో అధికార ప్రతినిధి ఎరీ కనేకొ ప్రకటనలో తెలిపారు.

ఎల్ఏసీ వద్ద ఉద్రిక్తతపై గుట్రెస్ ఆందోళన చెందారని పేర్కొన్నారు. పరిస్థితిని నిశీతంగా గమనిస్తున్నామని.. శాంతియుతంగా ఉండాలని ఇరుదేశాలను కోరినట్టు పేర్కొన్నారు. ఘర్షణలో భారత సిబ్బంది మృతి గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. సమాధానం చెప్పారు. వాస్తవానికి కల్నల్ సహా ఇద్దరు జవాన్లు చనిపోయారని తొలుత భారత ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. కానీ జీరో అంతకన్నా తక్కువ ఉష్ణోగ్రత నమోదవడంతో మంచులో కూరుకుపోయిన మరో 17 మంది కూడా చనిపోయారని ధృవీకరించారు. దీంతో మృతుల సంఖ్య 20కి చేరుకున్నదని తెలిపారు.
సోమవారం రాత్రి ఘర్షణ జరిగిన వెంటనే.. భారత్, చైనా సైన్యం అక్కడి నుంచి వెళ్లిపోయాయని మత్రం తెలిపారు. దేశ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వం కాపాడేందుకు భారత్ సైన్యం కట్టుబడి ఉంది అని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తూర్పు లడాఖ్లో ఎంతమంది చనిపోయారనే అంశంపై చైనా మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. కానీ అక్కడి మీడియా మాత్రం 43 మంది వరకు చనిపోయారని రిపోర్ట్ చేస్తుంది.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications