పాక్కు దిమ్మతిరిగే షాక్: ఇక నుంచి ఆర్థిక సహాయం ఉండదన్న అమెరికా..
ఈ మేరకు పాకిస్తాన్కు నిధులు నిలిపివేస్తున్నామని తాజాగా అమెరికా ప్రకటించింది.
వాషింగ్టన్: ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తూ ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తున్న పాకిస్తాన్కు అమెరికా నుంచి గట్టి షాక్ ఎదురైంది. ఉగ్రవాద నిరోధం పేరుతో అభివృద్ధి చెందిన దేశాల నుంచి నిధులు సేకరిస్తూ వాటిని దుర్వినియోగం చేస్తున్న పాక్ కు ఇక అమెరికా నుంచి నిధులు అందవు.
ఈ మేరకు పాకిస్తాన్కు నిధులు నిలిపివేస్తున్నామని తాజాగా అమెరికా ప్రకటించింది. పాకిస్తాన్కు అందించాల్సిన 50మిలియన్ డాలర్ల(రూ.322కోట్లను) నిలిపివేస్తున్నామని పెంటగాన్ అధికారులు తెలిపారు. ఉగ్రవాద నిరోధానికి పాకిస్తాన్కు ఇదివరకే నిధులు ఇచ్చామని, కానీ దానివల్ల ఎలాంటి ఫలితం లేదని అమెరికా అంటోంది.
ఉగ్రవాద నిరోధం కోసం వెచ్చించాల్సిన నిధులను పాకిస్తాన్ సరైన రీతిలో వినియోగించడం లేదన్న యూఎస్ స్టేట్ సెక్రటరీ జిమ్ మాటీస్ సూచన మేరకే నిధుల నిలుపుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిధుల నిలుపుదలకు సంబంధించి మాటీస్ నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయన్నారు.
గ్లోబల్ టెర్రరిజం అనే అంశంపై నివేదికను అందుకున్న యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్.. కొద్ది రోజుల్లోనే ఈ నిర్ణయం తీసుకోవడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పాక్ రియాక్షన్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.