ఫలితం ఆలస్యం ఎందుకు అవుతుందంటే.. పూర్తి కానీ కౌంటింగ్.. టెన్షన్ టెన్షన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల కూడా టెన్షన్ పుట్టిస్తోన్నాయి. బిడెన్, ట్రంప్.. నువ్వా నేనా అన్నట్టు ఎలక్టొరల్ కాలేజీ గెలుచుకుంటున్నారు. ఇందుకు తగ్గట్టు ఓట్ల లెక్కింపు కూడా ఆలస్యమవుతోంది. పెన్సిల్వేనియా, నెవాడ, మిచిగాన్, జార్జియాలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నెవాడ, జార్జియాలో రాత్రి వరకు చేపట్టి.. తర్వాత బ్రేక్ ఇస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు. ఉదయం ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగిస్తామని చెప్పారు.
పెన్సిల్వేనియా లాంటి రాష్ట్రంలో రాత్రి నుంచి ఉదయం వరకు మెయిల్ ఓట్లను కూడా చూస్తానమని చెబుతున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే పెన్సిల్వేన్సియా 10 రెట్ల మెయిల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయి. కరోనా వైరస్ వల్లే ఓట్లు అధికంగా నమోదయ్యాయి. ఇప్పుడు లెక్కింపు ప్రక్రియ మరింత ఆలస్యమవుతోంది.
బుధవారం ఉదయం నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభం కావాలి.. అయితే వాటిని లెక్కించకముందే ట్రంప్ తాను గెలిచానని ప్రకటించడం గందరగోళానికి దారితీసింది. పెన్సిల్వేనియా, మిచిగాన్, నెవాడ, జార్జియాలో పోస్టల్ బ్యాలెట్ పూర్తయితే.. ఎలక్టొరల్ కాలేజీ ఓట్లపై స్పస్టత వస్తోంది. అయితే కొన్నిచోట్ల సాంకేతిక సమస్యలు కూడా వస్తున్నాయి. దీనిని అధిగమించడం కోసం సిబ్బంది కృషి చేస్తున్నారు.