భారత్ కు అమెరికా బిగ్ షాక్..! రష్యా-ఇరాన్ పై కోపం మన మీద..!
ఇరాన్ (iran)పై ఏకపక్షంగా యుద్ధాన్ని ప్రారంభించడమే కాకుండా దాన్ని ఎలా ముగించాలో తెలియక సతమతం అవుతున్న అమెరికా (US)లో అసహనం అంతకంతకూ పెరుగుతోంది. దీంతో తమను ముప్పుతిప్పలు పెడుతున్న ఇరాన్ తో పాటు దానికి సహకరిస్తున్న దేశాలపై మరోసారి ఉరుముతోంది. ఇందులో భాగంగా భారత్ కు షాకిచ్చింది. రష్యా-ఇరాన్ నుంచి చమురు కొనుగోళ్లపై విధించిన ఆంక్షల మినహాయింపును పొడిగించబోమని అమెరికా తేల్చేచెప్పేసింది.
అమెరికా ఆంక్షలను ఎదుర్కోకుండా కొంతమేరకు ఇరాన్, రష్యా చమురును కొనుగోలు చేయడానికి గతంలో అనుమతించిన మినహాయింపులను పునరుద్ధరించబోమని అమెరికా ప్రకటించింది. హార్ముజ్ జలసంధి చుట్టూ నెలకొన్న అంతరాయాల మధ్య రష్యా చమురు కొనుగోలును కొనసాగించడానికి ఈ మినహాయింపులు వీలు కల్పించడంతో భారత్ ప్రధాన లబ్దిదారు అయింది.
హార్ముజ్ లో నౌకలు చిక్కుకుపోతున్న వేళ భారత్ కు ముఖ్యంగా రష్యా చమురు బాగా పనికొచ్చింది.

రష్యా చమురుపై ఉన్న సాధారణ లైసెన్సును పునరుద్ధరించబోమని, అలాగే ఇరాన్ చమురుపై ఉన్న సాధారణ లైసెన్సును కూడా పునరుద్ధరించబోమని అమెరికా ఆర్ధిక మంత్రి స్కాట్ బెస్సెంట్ తెలిపారు. మార్చి 11కి ముందు సముద్రంలో ఉన్న చమురు అంతా ఇప్పటికే వాడుకున్నారని తెలిపారు. హార్ముజ్ లో అంతరాయాల కారణంగా ప్రపంచ చమురు ధరలు పెరగకుండా అమెరికా ఈ మినహాయింపులు ఇచ్చింది. ఇప్పుడు వాటిని ఎత్తేయడంతో అంతర్జాతీయంగా చమురు ధరల మంట తప్పేలా లేదు. దీంతో భారత్ కచ్చితంగా ప్రత్యామ్నాయాలు ఎంచుకోవడమా లేక ధరల పెరుగుదలకు సిద్దం కావడమా అన్నది తేలాల్సి ఉంది.














Click it and Unblock the Notifications