నడిచే చేప, తుమ్మే కోతి: హిమాలయాల్లో కొత్తజాతులు
ఖాట్మాండ్: ప్రపంచ ప్రకృతి సంపద పరిరక్షణ సంస్థ ఇటీవలి కాలంలో హిమాలయాల్లో 200కు పైగా రకాల కొత్త జంతు, వృక్ష జాతులను కనుగొంది. వర్షం వచ్చినప్పుడు తుమ్మే కోతి, నడిచే చేప.. తదితర ఎన్నో కొత్త జాతులను గుర్తించింది.
వీటిని ఈస్టరన్ హిమాలయ పర్వతాల్లో ఇటీవలి సంవత్సరాల్లో గుర్తించారు. సంస్థకు సంబంధించిన సభ్యులు భూటాన్, నార్త్ ఈస్ట్ ఇండియా, నేపాల్, నార్త్ మయన్మార్, సదర్న్ టిబెట్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. పర్యావరణ ప్రమాద ప్రాంతాల్లో జాగృతం చేస్తున్నారు.
ఇందులో భాగంగా వారు పర్యటించారు. 2010లో సంబంధిత సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు నార్తర్న్ మయన్మార్ ప్రాంతంలో నలుపు, తెలుపు కోతిని గుర్తించారు. అది వర్షం వచ్చినప్పుడు భిన్నంగా ప్రవర్తించడాన్ని వారు గుర్తించారు.

నీలంతో పాటు రంగుల్లో కలుస్తున్న నడిచే చేపను గుర్తించారు. ఈ నడిచే చేప తల పాములా ఉంటుంది. ఈ చేప భూమి పైన నాలుగు రోజుల వరకు బతికి ఉంటుంది. గాలిని పీల్చుకొని బతకగల్గుతుంది. అంతేకాదు, ఇది నాలుగు వందల మీటర్ల వరకు భూమి మీద జారుకుంటు వెళ్లగలదు.
వీరు మరెన్నింటినో గుర్తించారు. 2009 నుంచి 2014 మధ్య 211 రకాల కొత్త జాతులను గుర్తించారు. ఇందులో 133 మొక్క రకాలు, ఆర్కిడ్స్, 26 రకాల చేపలు, 10 రకాల ఉభయచరాలు, 39 రకాల అకశేరుకాలు, ఒక సరీసృప జాతి, ఒక పక్షి జాతి, ఒక క్షీరజాతి రకాన్ని గుర్తించారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications