ఇమ్రాన్ ఖాన్కు ఏం జరిగింది?: అట్టుడుకుతున్న అడియాలా జైలు!
పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ జైలులో మృతి చెందారనే పుకార్ల నేపథ్యంలో అడియాలా జైలు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పీటీఐ కార్యకర్తల హింసాత్మక నిరసనలు, ఆందోళనల నేపథ్యంలో జైలు యంత్రాంగం, పాక్ ప్రభుత్వం ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం.. జైలులో ఆయనకు లభిస్తున్న వసతులపై స్పష్టతనిచ్చాయి. ఇమ్రాన్ ఖాన్ మరణించాలని పుకార్లు వ్యాపించడంతో జైలు అధికారులు వెంటనే స్పందిస్తూ.. ఈ ఊహాగానాలు పూర్తిగా నిరాధారమని ఖండించారు.
ఇమ్రాన్ ఖాన్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని.. ఆయన ఇప్పటికీ అడియాలా జైలులోనే ఉన్నారని అధికారులు ధ్రువీకరించారు. ఆయనను ఎక్కడికీ బదిలీ చేయలేదని స్పష్టం చేశారు. ఇమ్రాన్ ఖాన్కు అవసరమైన పూర్తి వైద్య సహాయం జైలులోనే అందుతోంది. అవినీతి, తీవ్రవాద కేసులకు సంబంధించి గత రెండేళ్లుగా ఇమ్రాన్ ఖాన్ జైలు జీవితం గడుపుతున్న సంగతి తెలిసిందే. పుకార్లకు తోడు ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై నెలకొన్న ఆందోళన కారణంగా ఆయన సోదరీమణులు నొరీన్ ఖాన్, అలీమా ఖాన్, ఉజ్మా ఖాన్ నిరసనలకు నాయకత్వం వహించారు.బుధవారం నాడు పీటీఐ కార్యకర్తలు, ఇమ్రాన్ సోదరీమణులు అడియాలా జైలు చెక్పోస్ట్ వద్ద బైఠాయించడంతో పరిస్థితి అదుపు తప్పింది. వేలాది మంది పీటీఐ కార్యకర్తలు అక్కడకు చేరుకొని హింసాత్మకంగా నిరసన తెలిపారు. జైలులోకి చొచ్చుకెళ్లడానికి కూడా ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి.

న్యాయస్థానం ఆదేశాలు ఉన్నప్పటికీ తమను వారానికి రెండుసార్లు ఇమ్రాన్ ఖాన్ను కలవడానికి అనుమతించడం లేదని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. అంతే కాకుండా ఇమ్రాన్ ఖాన్ను ఒంటరిగా నిర్బంధంలో ఉంచారని ఆయన సోదరులు, కుమారులు ఆరోపిస్తున్నారు. జైలు అధికారుు, పోలీసులు అలీమా ఖాన్కు ఇమ్రాన్ ఖాన్తో సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన తాత్కాలికంగా విరమించబడింది. దీంతో ఇమ్రాన్ సోదరీమణులు నేడు లేదా తదుపరి మంగళవారం ఆయనను కలుసుకునే అవకాశం ఉంది. గత వారం జరిగిన నిరసనలోనూ ఇమ్రాన్ సోదరీమణులను పోలీసులు అడ్డుకుని, రోడ్డుపై లాగి, అదుపులోకి తీసుకున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి.
ఖైదీగా ఇమ్రాన్ కాన్ సౌకర్యాలపై వివాదం
ఇమ్రాన్ ఖాన్ జైలులో అనుభవిస్తున్న సౌకర్యాలపై పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరింత పెంచాయి. ఇమ్రాన్ ఖాన్కు జైలులో లభిస్తున్న సౌకర్యాలు గతంలో ఖైదీలుగా ఉన్న ఇతర రాజకీయ నాయకులకు లభించిన వాటి కంటే చాలా మెరుగ్గా ఉన్నాయని ఆసిఫ్ పేర్కొన్నారు. "ఆయనకు వచ్చే ఆహారం మెనూను పరిశీలించండి. అది ఫైవ్ స్టార్ హోటల్లో కూడా లభించదు," అని ఆసిఫ్ వ్యంగ్యంగా అన్నారు. ఇమ్రాన్కు డబుల్ బెడ్, వెల్వెట్ దుప్పటి, టీవీ, వ్యాయామ పరికరాలు వంటి సదుపాయాలు కూడా ఉన్నాయని ఆయన ధ్రువీకరించారు.తన సొంత జైలు జీవితాన్ని ఉదాహరణగా చూపిస్తూ.. తాను చల్లటి నేలలపై నిద్రించానని, సాధారణ జైలు ఆహారం తిన్నానని, జనవరిలో కూడా వేడి నీరు లేకుండా గడిపానని, తన సెల్ నుంచి గీజర్ను తీసివేశారని ఆసిఫ్ పేర్కొన్నారు. దీని ద్వారా ఇమ్రాన్కు ప్రత్యేక రాయితీలు లభిస్తున్నాయని ఆయన పరోక్షంగా వాదించారు.
-
పాకిస్థాన్ ఖేల్ ఖతం.. లీటర్ పెట్రోల్ రూ. 321, డీజిల్ రూ. 335.. -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్












Click it and Unblock the Notifications