చనిపోయిన భర్త అవయవాలతో ఎయిర్ పోర్ట్లో మహిళ, అరెస్ట్
సిడ్నీ: ఆస్ట్రేలియాలో షాకింగ్ విషయం వెలుగు చూసింది. ఓ మహిళ చనిపోయిన తన భర్త పేగులు తీసుకు వెళ్తుండగా గ్రాజ్ విమానాశ్రయ సిబ్బంది ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె ప్రవర్తన పైన అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఆ తర్వాత ఆమె వద్ద తనిఖీ చేయగా చనిపోయిన భర్త పేగులు కనిపించాయి. మీడియాలో వస్తున్న సమాచారం మేరకు.. ఆమె వెళ్తుండగా కస్టమ్స్ అధికారులు చూశారు. ఆమె తీరు పైన అనుమానం వ్చచింది. దీంతో ఆమె వద్ద ఉన్న లగేజీని చెక్ చేయాలని నిర్ణయించారు.
ఆమె మొరాకో నుంచి వచ్చి, గ్రాజ్ విమానాశ్రయంలో దిగారు. ఆమె వద్ద భర్త తల, ఇతర శరీర అవయవాలు కూడా గుర్తించారు. అతని నుంచి తీసిన పేగులను జాగ్రత్తగా రెండు డబ్బాలలో జాగ్రత్తగా పెట్టింది.

దీనిపై అధికారులు ఆమెను ప్రశ్నించగా.. తన భర్త అవయవాలను (ఆర్గాన్స్) తీసుకు వెళ్తున్నట్లు చెప్పింది. తన భర్తకు ఎవరో విషం ఇచ్చారని తనకు అనుమానంగా ఉందని, మెడికల్ చెకప్ కోసం తీసుకు వెళ్తున్నట్లు చెప్పింది.
గ్రాజ్ విమానాశ్రయం ఆస్ట్రేలియాలోని రెండో అతి పెద్ద నగరంలో ఉంది. ఈ విమానాశ్రయం నుంచి డొమెస్టిక్, అంతర్జాతీయ విమానాలు వెళ్తాయి. గ్రాజ్ విమానాశ్రయం నుంచి రోజుకు ఆరువేల మంది కంటే ఎక్కువ మంది ప్రయాణిస్తుంటారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications