మా జోలికి వస్తేనే అణు దాడి: ఉత్తరకొరియా అధ్యక్షుడు
ఉత్తర కొరియా: తమ జోలికి రాకుంటే మాకు మేం ఎవరి జోలికి వెళ్లమని, మా జోలికి వస్తే మాత్రం అణ్వాయుధాలతో దాడి చేస్తామని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ హెచ్చరించాడు. తమ దేశ సార్వభౌమాధికారాన్ని టచ్ చేస్తే మాత్రం అణ్వాయుధాలు ఉపయోగిస్తామన్నాడు.
ఈ సందర్భంగా ప్రపంచ దేశాలు తమ దేశం ఉత్పత్తి చేస్తున్న అణ్వాయుధాల పైన ఆందోళన వ్యక్తం చేస్తుండటాన్ని ఆయన ప్రస్తావించారు. అంత సామాన్యంగా తమ దేశం అణ్వాయుధాలను ఉపయోగించబోదని చెప్పారు. ఎవరైనా భారీగా దండెత్తి వచ్చి తమను ఆక్రమించే ప్రయత్నం చేస్తే తప్ప అలా చేయమన్నారు.

పార్టీ ఆఫ్ కొరియా ఏడో సమావేశం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. ఎంతో విశ్వసనీయతతో తన అణు కార్యక్రమాన్ని ఉత్తర కొరియా ముందుకు తీసుకు వెళ్తుందని, అణ్వాయుధ రహిత ప్రపంచంగా అవతరించేందుకు తమ వంతు కృషి కూడా చేస్తామని చెప్పాడు. ప్రపంచంలోని తమ శత్రు దేశాల పైన తమకు గౌరవం ఉందన్నాడు.












Click it and Unblock the Notifications