పాకిస్థాన్ కు ప్రపంచబ్యాంకు భారీ సాయం.. భారత్ అలర్ట్..!
పాకిస్థాన్ కు ప్రపంచబ్యాంకు భారీ సాయాన్ని ఆమోదించింది. 700 మిలియన్ డాలర్ల సాయాన్ని ఆమోదిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ లోని ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టేందుకు అలాగే సేవారంగాన్ని పెంపోందించేందుకు వరల్డ్ బ్యాంక్ రుణ సదుపాయాన్ని కల్పించినట్లు సమాచారం. పబ్లిక్ రీసోర్స్ ఫర్ ఇన్ క్లూజివ్ డెవలప్ మెంట్ మల్టీఫేజ్ ప్రోగ్రామాటిక్ అప్రోచ్(PRID-MPA) లో భాగంగా మొత్తం 1.35 బిలియన్ డాలర్ల సాయాన్ని వరల్డ్ బ్యాంకు అప్రూవల్ చేసినట్లు డాన్ పత్రిక కథనం ద్వారా వెల్లడవుతోంది. ఇందలో 600 మిలియన్ డాలర్లను ఫెడరల్ లెవెల్ ప్రోగ్రామ్స్ కు అలాగే 100 మిలియన్ డాలర్లు సింధ్ రాష్ట్రంలోని అభివృద్ధి పనులకు కేటాయించింది.
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ధాటికి పాకిస్థాన్ అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. అలాగే పాక్ పై అనేక కఠినమైన ఆంక్షలు విధించింది భారత్. సింధూ జలాల నిలిపివేతతోపాటుగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం నిలిచిపోయింది. అలాగే ఇతర పలు కారణాలతో పాకిస్థాన్ ఆర్థిక రంగం దెబ్బతిన్నది. ఈ క్రమంలో పాకిస్థాన్ లోని ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు వరల్డ్ బ్యాంకు మొత్తం 1.35 బిలియన్ డాలర్ల సాయాన్ని ప్రకటించింది. దానిలో భాగంగా తాజాగా 700 మిలియన్ డాలర్ల సాయాన్ని ఆమోదిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇక ఇటీవల పాకిస్థాన్ లోని పంజాబ్ రాష్ట్రంలోని ప్రాథమిక విద్యాభివృద్ధి కోసం ఈ ఏడాది ఆగస్టులో 47.9 మిలియన్ డాలర్లు సాయం చేసింది. తాజాగా మరో 700 మిలియన్ డాలర్లు ఆమోదించింది వరల్డ్ బ్యాంకు. ఈ విషయాన్ని పాకిస్థాన్ లోని వరల్డ్ బ్యాంకు ఆఫీసర్ బోలోర్మా అంగాబజార్ ధృవీకరించారు. పాకిస్థాన్ లో సమీకృత, సుస్థిర అభివృద్ది కోసం దేశీయంగా ఉన్న రీసోర్స్ లను సమర్థవంతంగా వినియోగించి మెరుగైన ఫలితాలను ప్రజలకు అందించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

పాకిస్థాన్ ప్రభుత్వంతో పాటు సింధ్ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పాఠశాలలు, క్లినిక్స్ ట్యాక్స్ వ్యవస్థలపై ఫండింగ్ చేస్తున్నట్లు బోలోర్మా అంగాబజార్ తెలిపారు. సామాజిక, పర్యావరణ పెట్టుబడులతో ప్రజల్లో నమ్మకాన్ని బలోపేతం చేయనున్నట్లు పేర్కొన్నారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!!












Click it and Unblock the Notifications