తన యజమానిని చంపిన డేంజర్ పక్షి

న్యూఢిల్లీ : సాధుకునే పక్షి యజమానికి శత్రువయింది. ఎందుకనో తెలియదు కాని తనను పెంచుకునే యజమానినే నిట్టనిలువునా చంపివేసింది ఓ పక్షి, అయితే అది ప్రపంచంలోనే చాల ప్రమాదకరమైన పక్షిగా పేరుగాచింది. ఆస్ట్రేలియాలో జీవించే ఈ పక్షి , ఆస్ట్ర్రిచ్, ఈము పక్షుల వలే ఉంటుంది.

Worlds Most Dangerous Bird

తన పెరట్లో పెంచుకునే పక్షి మనిషిని చంపడమేమిటి అని భావిస్తున్నారా, పక్షి ఎలా చంపుతుందని అనుమానాలు ఉన్నాయా ,అవును మనిషికంటే ఎత్తైన, మనిషి తోపాటు బరువుండే ఎగరలేని పక్షులు అస్ట్ర్రేలియా దేశంలో సంచరిస్తాయి. వీటీనీ కాసోవేరీస్ అని పిలుస్తారు, ఇవి ఈము ,ఆస్ట్ర్రిచ్ పక్షిలను పోలి ఉంటాయి. కాగా ఇవి ఆరు ఫీట్ల వరకు పోడవు ఉండడంతోపాటు సుమారు 60 కిలోల బరువు కలిగి ఉంటాయి. నల్లటి రెక్కలు, బ్లూ మెడతో కూడిన తలతో ఉంటాయి. కాగా వీటీ కాళ్లకు 10 సెంమీ మేర కత్తుల లాంటీ వేళ్లు ఉంటాయి. ఇవి గంటకు 50 కి.మీ వేగంతో పరుగెడుతాయి.

కాగా ఆస్ట్రేలియాలోని పాపువా న్యూగినియా లో ఈ సంఘటన జరిగింది, తన పెరట్లో కాసోవెరీస్ ను పెంచుకుంటున్నారు.అనుకోకుండా ఆ యజమానిపై కాసోవెరీస్ దాడి చేసింది. దీంతో యజమానిపై దాడి చేసింది.అయితే ఈ సంఘటనను పరీశీంచిన అధికారులు మాత్రం ఇది ప్రమాదవశాత్తు జరిగిందని అంచనా వేస్తున్నారు. అయితే ఇలాంటీ సంఘటనలు గతంలో కూడ జరిగాయని , వారు చెబుతున్నారు.కాగా జూ లో ఈ పక్షులను ప్రత్యేకంగా ఉంచుతామని, అతి జాగ్రత్తగా వీటితో ఉంటామని అక్కడి జూ అధికారులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+