క్రాష్: కనిపించిన అల్జీరియా విమానం శకలాలు

అల్జీరియాకు చెందిన పౌరవిమానం కూలిపోయినట్లు ఆ దేశం నిర్ధారించింది. గురువారం నాడు బుర్కినా ఫాసో నుంచి అల్జీర్స్కు బయలుదేరిన విమానం మాలి సమీపంలో కూలిపోయినట్లు నిర్ధారణ అయింది. అధికారులు విమాన శిథిలాలను కూడా కనుగొన్నారు. విమానం ప్రయాణిస్తున్న సమయంలో వాతావరణం అనుకూలంగా లేదు.
ఆ ప్రాంతానికి భయంకరమైన తుపాన్ ముప్పు ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఆ కారణం వలనే విమానం కూలిపోయి ఉంటుందని అధికారులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు.విమానం బుర్కినా ఫాసోలో ప్రయాణం ప్రారంభించిన గంట వ్యవధిలో గ్రౌండ్ కంట్రోల్తో సంబంధాలు తెగిపోయాయి.
విషయం తెలిసిన వెంటనే ఫ్రెంచ్ ఫైటర్ జెట్ విమానాలు రంగంలోకి దిగాయి. అలాగే మాలి నైజీరియా సరిహద్దుల్లో ప్రయాణిస్తున్న విమానాలు కూడా అల్జీరియా విమానం ఆచూకీ తెలుసుకోడానికి ప్రయత్నించాయి. చివరికి మాలి దేశం సమీపంలో శిథిలాలు దొరకడంతో విమానం కూలిపోయిందని అధికారులు నిర్థారించారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications