ప్రాణం తీసిన సెల్ఫీ: బ్రిడ్జిపైనుంచి పడి యువతి మృతి
మాస్కో: ఇటీవల అజాగ్రత్తగా సెల్ఫీలు తీసుకోవడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా యువతలో మార్పు రావడం లేదు. అందరూ మెచ్చే సెల్ఫీ తీసుకోవాలనే కోరికతో.. ప్రమాదపుటంచుల సెల్ఫీలు దిగుతూ తమ ప్రాణాలను కోల్పోతున్నారు.
తాజాగా రష్యాలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. అన్నా కృపేనికోవా(21) అనే యువతి ఓ బ్రిడ్జిపై నిలుచుని సెల్ఫీ తీసుకుబోయింది. ప్రమాదవశాత్తు 40 అడుగుల కిందకిపడిపోయి, ప్రాణాలు కోల్పోయింది.

టూరిజం గ్రాడ్యుయేట్ అయిన అన్నా ఓ ఫ్రెండ్ పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకునేందుకు మిగతా మిత్రులతో కలిసి విహారానికి బయల్దేరారు. వారు ప్రయాణిస్తున్న బస్సు ఓ వంతెన వద్దకు రాగా, అక్కడి ప్రకృతి దృశ్యాలను వీక్షించేందుకు బస్సును ఆపి కిందికి దిగారు.
ఈ క్రమంలోనే అన్నా సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అన్నా మద్యం సేవించి ఉందేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే తమలో ఎవరూ మద్యం సేవించలేదని అన్నా మిత్రులు పోలీసులకు తెలిపారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications