ప్రాణం తీసిన సెల్ఫీ: బ్రిడ్జిపైనుంచి పడి యువతి మృతి
మాస్కో: ఇటీవల అజాగ్రత్తగా సెల్ఫీలు తీసుకోవడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా యువతలో మార్పు రావడం లేదు. అందరూ మెచ్చే సెల్ఫీ తీసుకోవాలనే కోరికతో.. ప్రమాదపుటంచుల సెల్ఫీలు దిగుతూ తమ ప్రాణాలను కోల్పోతున్నారు.
తాజాగా రష్యాలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. అన్నా కృపేనికోవా(21) అనే యువతి ఓ బ్రిడ్జిపై నిలుచుని సెల్ఫీ తీసుకుబోయింది. ప్రమాదవశాత్తు 40 అడుగుల కిందకిపడిపోయి, ప్రాణాలు కోల్పోయింది.

టూరిజం గ్రాడ్యుయేట్ అయిన అన్నా ఓ ఫ్రెండ్ పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకునేందుకు మిగతా మిత్రులతో కలిసి విహారానికి బయల్దేరారు. వారు ప్రయాణిస్తున్న బస్సు ఓ వంతెన వద్దకు రాగా, అక్కడి ప్రకృతి దృశ్యాలను వీక్షించేందుకు బస్సును ఆపి కిందికి దిగారు.
ఈ క్రమంలోనే అన్నా సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అన్నా మద్యం సేవించి ఉందేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే తమలో ఎవరూ మద్యం సేవించలేదని అన్నా మిత్రులు పోలీసులకు తెలిపారు.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications