యూజ్ లెస్ ఫెలో అంటూ మున్సిపల్ కమీషనర్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే వీరంగం
యూజ్ లెస్ ఫెల్లో అంటూ మున్సిపల్ కమీషనర్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే వీరంగం వేశారు . నోటికొచ్చినట్టు మాట్లాడారు. ఉన్నతాధికారి అన్న విచక్షణ మరచి మరీ తిట్టి పోశారు. అంతే కాదు వార్నింగ్ కూడా ఇచ్చారు.
తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రగతి కార్యక్రమం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక ఈనేపధ్యంలోనే కరీం నగర్ జిల్లా చొప్పదండి మున్సిపల్ కమిషనర్ రాజేంద్ర కుమార్పై ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణ ప్రగతిపై సమాచారం ఇవ్వలేదంటూ ఆయన మండిపడ్డారు . యూజ్ లెస్ ఫెల్లో, నీకసలు తలకాయ ఉందా అంటూ రాజేంద్రకుమార్పై ఎమ్మెల్యే రవిశంకర్ కమీషనర్ పై మండిపడ్డారు.

పట్టణ ప్రగతి ప్రారంభమై రెండు రోజులు గడుస్తున్నా స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వాలని జ్ఞానం లేదా అంటూ ఫైర్ అయ్యారు. పనుల పురోగతిపై తమకు కనీస సమాచారం ఇవ్వలేదంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఇక ఇలాంటి తమాషాలు, పిచ్చి వేషాలు వేయొద్దని మున్సిపల్ కమిషనర్కు ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చారు. పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కమీషనర్ తీరుపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తానని చెప్పిన ఆయన మున్సిపల్ కమీషనర్ అని కూడా చూడకుండా తిట్టిపోశారు. ఇప్పుడు ఈ ఘటన అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications