కేటీపీఎస్లో ఆగిన పవర్ ప్రొడక్షన్.. రోజుకు 3 కోట్లు నష్టం..!
భద్రాద్రి : పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (KTPS) లోని 7వ దశలో పవర్ ప్రొడక్షన్ ఆగిపోయింది. సాంకేతిక కారణాలతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో రోజుకు 3 కోట్ల రూపాయల నష్టం వాటిల్లనున్నట్లు తెలుస్తోంది. ఇంకో రెండు రోజులు కూడా పవర్ ప్రొడక్షన్ ఆగిపోనున్నట్లు సమాచారం.

బాయిలర్ ట్యూబ్స్ నాణ్యతాలోపమే ప్రస్తుత సమస్యకు కారణమని తెలుస్తోంది. సేఫ్టీ వాల్వ్ మూసుకోవడంతో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఆటంకమేర్పడింది. అయితే ఈ ప్లాంట్ ప్రారంభించిన నాటి నుంచి నాలుగు నెలల్లో నాలుగైదు సార్లు టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినట్లు సమాచారం. అదలావుంటే కేటీపీఎస్ 7వ దశకు సంబంధించిన నిర్మాణం కేవలం 40 నెలల్లో పూర్తయింది. రికార్డు స్థాయిలో త్వరగా దీని నిర్మాణం కంప్లీట్ చేయాలనే ప్రభుత్వ ఉద్దేశం.. నాణ్యతాలోపాలకు కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications