కర్నూలు జిల్లాలో భూ ప్రకంపనలు: భయంతో ఇళ్ల నుంచి జనం పరుగులు
కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రాతనలో భూ ప్రకపంనలు చోటు చేసుకోవడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు.
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో సోమవారం భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. తుగ్గలి మండలం రాతనలో భూ ప్రకపంనలు చోటు చేసుకోవడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. భూ ప్రకంపనలతో భయాందోళనలకు గురైన ప్రజలు తమ తమ నివాసాల నుంచి బయటకు పరుగులు తీశారు.
ఈ భూకంపం ధాటికి గ్రామంలోని పలు ఇళ్లకు బీటలు వారినట్లు స్థానికులు తెలిపారు. రాతనలోని దాదాపు 15 ఇళ్లకు బీటలు వారగా, గ్రామంలోని పలు ప్రాంతాల్లో సీసీ రోడ్డుకు కూడా బీటలువారినట్లు స్థానికులు వెల్లడించారు.

భూ ప్రకంపనల సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే శ్రీదేవి, పలువురు అధికారులు ఆ గ్రామాన్ని సందర్శించారు. భూ ప్రకంపనల తీవ్రత ఏ స్థాయిలో నమోదైంది.. రిక్టర్ స్కేలుపై ఎంత మేర నమోదైందనేది విషయాలు తెలియాల్సి ఉంది.
కాగా, ఇటీవల భూకంపాలు ప్రపంచంలో వేలాది మంది ప్రాణాలు తీసిన విషయం తెలిసిందే. టర్కీ-సిరియా దేశాల్లో ఫిబ్రవరిలో చోటు చేసుకున్న భూకంపం కారణంగా 50 వేల మందికిపైగా ప్రజలు మరణించిన విషయం తెలిసిందే. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటికీ అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం












Click it and Unblock the Notifications