తొలుత ఏపీలో.. తర్వాత ఇతర రాష్ట్రాలు, కర్నూలులో ఆక్సిజన్ ప్లాంట్: సోనూ సూద్
కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఇమ్యూనిటీ పవర్ లేని వారికి ఆక్సిజన్ లెవల్ తగ్గిపోతోంది. దీంతో ప్రాణ వాయువు కంపల్సరీ అవుతోంది. దీంతో మరోసారి సోనూ సూద్ స్పందించారు. ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణానికి ముందుకొచ్చారు. ముందుగా ఆంధ్ర ప్రదేశ్లో నిర్మిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. కర్నూలులో తొలి ఆక్సిజన్ ప్లాంటు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు.
కర్నూలు జీజీహెచ్ లో ఆక్సిజన్ ప్లాంటు ఏర్పాటు చేస్తున్నట్టు సోనూ సూద్ ప్రకటించారు. అందుకు అవసరమైన అనుమతులను అధికారులు మంజూరు చేశారు. కొవిడ్ తో ధైర్యంగా పోరాడేందుకు ఆక్సిజన్ ప్లాంట్ లు సహాయపడతాయని భావిస్తున్నానని సోనూ సూద్ తెలిపారు. ఏపీలో ఆక్సిజన్ ప్లాంట్ ల నిర్మాణం పూర్తయ్యాక, ఇతర రాష్ట్రాల్లోనూ ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణం చేపడతానని వివరించారు. జూన్, జులై నెలల్లో ఇతర రాష్ట్రాల్లోనూ ఆక్సిజన్ ప్లాంట్ ల నిర్మాణం ఉంటుందని పేర్కొన్నారు.

Recommended Video
కర్నూలులో తొలి ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని సోనూసూద్ ప్రకటనతో జిల్లా అధికారులు ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు అనుమతులిచ్చారు. కష్ట సమయంలో ముందుకొచ్చిన సోనూ సూద్ కు అభినందనలు తెలిపారు. వెంటనే ప్లాంట్ ఏర్పాటు పనులను ప్రారంభించారు. లాక్ డౌన్ సమయంలో అన్నార్థుల ఆకలి తీర్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రాణ వాయువు అందిస్తూ.. మంచితనానికి మారుపేరుగా నిలిచారు.












Click it and Unblock the Notifications