ఆఖరుకు వినాయక చందాను కూడా వదలకుండా వాడుకుంటున్న చోర శిఖామణులు
వినాయక చవితి సమీపిస్తుంది. గణేష్ నవరాత్రుల చందాల కోసం వాడవాడలా హడావుడి కనిపిస్తోంది. సందట్లో సడేమియా అంటూ వినాయక చవితి చందాల పేరుతో చైన్ స్నాచింగ్ లకు పాల్పడవచ్చని ప్లాన్ చేసుకున్నారు ఇద్దరు ప్రబుద్ధులు. అందులో భాగంగా వినాయక చవితి వస్తుండడంతో చందా వసూళ్ల ముసుగులో ఇద్దరు నిందితులు ఓ మహిళ మెడలో చైన్ స్నాచింగ్ కు పాల్పడడం నిజామాబాద్ పట్టణంలో కలకలం రేపింది. పట్టపగలు జరిగిన ఈ ఘటనలో ఇద్దరు నిందితుల్లో ఒకరు చేతికి చిక్కడంతో స్థానికులు పోలీసులకు అప్పగించారు.ఇక గణేష్ చందాలను కూడా వదలని వీరి అఘాయిత్యానికి అవాక్కయ్యారు.
పోలీసుల కథనం మేరకు... నిజామాబాద్ నగరంలో పట్టపగలు దొంగలు హల్ ఛల్ చేశారు. గణపతి చందా ముసుగులో వచ్చిన దొంగలు చైన్ స్నాచింగ్కు పాల్పడ్డారు. ఈ ఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. సాయికృపనగర్ కాలనీలో మొదటి అంతస్థులో ఓ ఇంటికి గణేష్ చందా అంటూ దుండగులు చందా పుస్తకంతో వచ్చారు. డబ్బులు ఇవ్వకపోవడంతో మంచినీళ్లు అడిగి చైన్ స్నాచింగ్కు యత్నించారు.

భయంతో మహిళ అరవడంతో ఆమె భర్త దుండగులను పట్టుకోబోయారు. తప్పించుకోబోయిన దుండగులను పట్టుకుని ఇంటి గేట్లు మూసి వారిని కట్టేసే ప్రయత్నం చేశాడు. దుండగులు ఆయనతో వాగ్వాదానికి దిగారు.
దీంతో కొద్ది సేపు తోపులాట జరిగింది. అక్కడినుంచి తప్పించుకుని ఒక దొంగ పరారయ్యాడు. ఈ ఘటనలో మహిళ భర్తకు గాయాలు అయ్యాయి. పట్టుబడిన దొంగను స్థానికుల సహాయంతో నిజామాబాద్ పోలీసులకు అప్పగించారు. చోరీకి యత్నించినవారు మహారాష్ట్రకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న దొంగ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications