సిద్దిపేటలో ఐటీ టవర్ ప్రారంభించిన మంత్రులు: కేటీఆర్‌‌పై హరీశ్ రావు ప్రశంసలు

సిద్దిపేట: సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో యావత్‌ దేశానికే తెలంగాణ రోల్‌ మోడల్‌గా నిలవగా.. తెలంగాణలోని అన్ని జిల్లాల అభివృద్ధికి సిద్దిపేట సూచిక అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు సిద్ధిపేట, బంగారు తెలంగాణ, బంగారు భారత్‌ వంటి సమగ్ర అభివృద్ధికి సాక్షాత్కరించినప్పుడే వాస్తవికంగా నిజమవుతాయని రామారావు అన్నారు.

గురువారం సిద్దిపేటలో రూ.63 కోట్లతో నిర్మించిన ఐటీ టవర్‌ను ఆర్థిక మంత్రి టీ హరీశ్‌రావుతో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మరోవైపు, ప్రజలకు రుచికరమైన, నాణ్యమైన మాంసాన్ని అందించాలనే లక్ష్యంతో ఇర్కోడ్ వద్ద 2 ఎకరాల స్థలంలో రూ. 6 కోట్లతో ఏర్పాటు చేసిన ఆధునిక స్లాటర్ హౌజ్(కబేళా)ను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. దీంతోపాటు రూ. 20 కోట్లతో సీసీ, బీటీ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.

Siddipet is index for development in Telangana, State is role model for India: IT tower inaugurated by KTR, Harish Rao

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీని విస్తరించి, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నామన్నారు. సిద్దిపేట ఐటీ టవర్‌తో 5 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు. ప్రభుత్వంతో ఇప్పటికే 15 అంతర్జాతీయ కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. తొలి విడతలో 750 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసిన కంపెనీలు.. రెండు షిప్టులు కలిపి 1500 మంది ఉద్యోగం చేసే అవకాశం కల్పిస్తున్నాయన్నారు.

ఐటీ హబ్‌కు మరిన్ని నిధులు మంజూరు చేసి విస్తారమన్న కేటీఆర్.. సిద్దిపేటలో టీ-హబ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన నాడు ఐటీ ఎగుమతులు కేవలం రూ. 56 వేల కోట్లుగా ఉంటే.. ప్రస్తుతం రాష్ట్రం నుంచి రూ. 2.40 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు జరుగుతున్నాయని కేటీఆర్ తెలిపారు.

Siddipet is index for development in Telangana, State is role model for India: IT tower inaugurated by KTR, Harish Rao

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు లాంటి దార్శనికత ఉన్న నాయకుడిని సిద్దిపేట ప్రజలు అందించారని, రాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర పోషించారన్నారు. మీరు కే చంద్రశేఖర్‌రావుని ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎన్నుకోకుంటే టీఆర్‌ఎస్‌ పార్టీ ఉండేది కాదు, ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించేది ఉండేది కాదని అన్నారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టడంలో సిద్దిపేట కీలకం. చంద్రశేఖర్ రావు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 1987లో 10 వేల మొక్కలు నాటడం ద్వారా హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు.

సిద్దిపేట దళితుల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి దళిత చైతన్య జ్యోతిని ప్రారంభించారని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. చంద్రశేఖర్ రావు 1997లో దిగువ మానేరు నుంచి నీటిని సరఫరా చేయడం ద్వారా నియోజకవర్గంలో పైపుల నీటి కనెక్షన్‌ను కూడా ప్రారంభించారు. చివరికి, ఈ కార్యక్రమం రాష్ట్రంలో మిషన్ భగీరథ కార్యక్రమంగా మారింది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దీనిని దేశవ్యాప్తంగా హర్ ఘర్ జల్ కార్యక్రమంగా పునరావృతం చేసిందని మంత్రి కేటీఆర్ అన్నారు.

తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. కేటీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. కలలోనైనా సిద్దిపేటకు ఐటీ హబ్‌ వస్తుందని అనుకున్నామా. రాష్ట్రమే రాకపోతే సిద్దిపేట జిల్లా వచ్చేదా? కేసీఆర్‌ సిద్దిపేటకు బలమైన పునాది వేశారు. కేసీఆర్‌ ప్రణాళికలను అమలు చేస్తున్నారు. ఐటీ టవర్‌ ప్రారంభంతో సిద్దిపేటలో 1500 మందికి ఉపాధి వచ్చింది. ఐటీ టవర్‌ ప్రారంభం రోజునే సంస్థలు వచ్చి ఉద్యోగాలు ఇవ్వడం చాలా గొప్ప పరిణామం. కేటీఆర్‌ లాంటి ఐటీ మంత్రి మా రాష్ట్రంలో లేరని పక్కరాష్ట్ర ప్రజలు ఫోన్‌ చేస్తున్నారు. ఐటీ రంగంలో అత్యధిక వృద్ధి రేటు మన రాష్ట్రం సాధించింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు చాలా చక్కగా ఉన్నాయి అని హరీశ్ రావు వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+