వామ్మో.. ఏందిది.. ఏడాది క్రితం పోస్టుపై ఇప్పుడు కేసా.. టీడీపీ నేత ఆత్మహత్య..
ప్రతిపక్ష కార్యకర్తలకు వేధింపులు తప్పడం లేదు. పాత కేసులను తోడి.. మరీ కేసులు పెడుతున్నారు. దీంతో టీడీపీ నేతలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఏడాది క్రితం పెట్టిన సోషల్ మీడియా పోస్టుపై తాజాగా కేసు నమోదు చేశారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన టీడీపీ నేత ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం పొత్తంగి గ్రామంలో ఈ ఘటన జరిగింది.
గతేడాది పంచాయతీ ఎన్నికల సమయంలో టెక్కలి నియోజకవర్గ వైసీపీ నేతపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టు పెట్టారని టీడీపీ సోషల్ మీడియా సభ్యుడు కోన వెంకటరావుపై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం సాయంత్రం వెంకటరావు ఇంటికి చేరుకున్న టెక్కలి, మందస పోలీసులు ఆయన ఇంటిలో లేకపోవడంతో పోలీస్ స్టేషన్కు రావాల్సి ఉంటుందని ఆయన భార్య కృష్ణవేణిని హెచ్చరించి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఇంటికి చేరుకున్న భర్తకు కృష్ణవేణి విషయం చెప్పడంతో మనస్తాపం చెందిన వెంకటరావు రాత్రి ఏడు గంటల సమయంలో పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.

టీడీపీ నేతలు, కార్యకర్తలు నిన్న ఉదయం ఆసుపత్రికి చేరుకుని ఆందోళనకు దిగారు. పోలీసుల వేధింపులు భరించలేకే వెంకటరావు ఆత్మహత్య చేసుకున్నారని, మంత్రి అప్పలరాజు ఒత్తిడితో ఇలా చేశారని ఆరోపించారు. వెంకటరావు మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్నం వరకు ఆసుపత్రి వద్దే పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆసుపత్రికి చేరుకున్న డీఎస్పీ శివరామిరెడ్డి టీడీపీ నాయకులతో చర్చలు జరిపారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని, బాధితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వెంకటరావు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటనపై స్పందించిన టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. వెంకటరావును ఆత్మహత్యకు పురిగొల్పిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, వైసీపీ నేతలపై తక్షణమే హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
-
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !! -
టోల్ కక్కండి- రేట్ ఖరార్ చేసిన ఇరాన్












Click it and Unblock the Notifications