నీళ్ల కోసం వెళ్తే.. కాటేసిన కామాంధుడు: థియేటర్ లో బాలికపై అత్యాచారం..
హైదరాబాద్: మైనర్ బాలికలపై అత్యాచార ఘటనలకు తెరపడటం లేదు. ప్రభుత్వాలు చట్టాలను కఠినతరం చేస్తున్నా అత్యాచార ఘటనలకు తెరపడకపోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా హైదరాబాద్ బోరబండలో ఓ మైనర్ బాలిక(14)పై ప్రశాంత్(25) అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
వివరాల్లోకి వెళ్తే.. బోరబండలో నివసించే ఓ బాలిక మంచినీళ్ల కోసం ప్రతీరోజు విజేత థియేటర్ ఆవరణలోని నల్లా వద్దకు వస్తుంది. ఇదే క్రమంలో మంగళవారం ఉదయం 7 గం. సమయంలో బాలిక తన వదినతో కలిసి అక్కడికి వచ్చింది. బాలిక వదిన బిందెలో నీళ్లు తీసుకుని వెళ్లగా.. బాలిక మరిన్ని నీళ్లు పట్టడం కోసం అక్కడే ఉంది.

ఇంతలో అక్కడికి వచ్చిన ప్రశాంత్ అనే యువకుడు బాలికను బలవంతంగా థియేటర్ మరుగుదొడ్డిలోకి లాక్కుపోయాడు. బాలిక గట్టిగా ప్రతిఘటించి కేకలు వేయగా.. ఆమెపై తీవ్రంగా దాడిచేశాడు. ఆపై ఆమెపై అత్యాచారం జరిపాడు. బాధితుడి నుంచి తప్పించుకున్న బాలిక ఇంటికి చేరుకుని.. విషయం తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు విజేత థియేటర్ లో స్వీపర్ గా పనిచేస్తున్నట్టు గుర్తించారు. బాలికను వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడిపై పోక్సో చట్టాల కింద కేసులు నమోదు చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications