వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

1850 పాజిటివ్ కేసులు నమోదు, ఐదుగురి మృతి, గ్రేటర్ పరిధిలో 1500 పైచిలుకు పాజిటివ్ కేసులు

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. 1500 పైచిలుకు కేసులు నమోదవుతూ గుండేల్లో గుబులు రేపుతోన్నాయి. శనివారం కూడా 1850 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. వైరస్ సోకిన ఐదుగురు శనివారం చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 288కి చేరింది. 1850 పాజిటివ్ కేసులతో.. మొత్తం కేసుల సంఖ్య 22 వేల 312కి చేరింది.

1850 coronavirus positive cases register in telangana..

Recommended Video

Panic in Hyderabad as Top Jeweller Party With Hundreds of Attendees Got Corona || Oneindia Telugu

ప్రస్తుతం రాష్ట్రంలో 10 వేల 487 మందికి చికిత్స అందిస్తున్నామని వైద్యారోగ్యశాఖ తెలిపింది. గ్రేటర్ హైదరాబాద్‌లో పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. శనివారం 1572 కేసులు రికార్డయి.. డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. రంగారెడ్డిలో 92, మేడ్చల్-53, కరీంనగర్-18, వరంగల్ అర్బన్-31, నల్గొండ-10, నిజామాబాద్-17 కేసులు నమోదయ్యాయి. శనివారం 1342 మంది డిశ్చార్జయ్యారు. దీంతో ఇప్పటివరకు ఇంటికి వెళ్లిపోయిన వారి సంఖ్య 11 వేల 537గా ఉంది.

English summary
1850 coronavirus positive cases register in telangana state in saturday health officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X