ఆ 2 వేల కేసులను తిరిగి విచారించండి, ప్రత్యేక విభాగం కూడా : హెచ్చార్సీకి అడ్వకేట్ కంప్లైంట్
హైదరాబాద్ : బొమ్మాలరామారం ఘటనతో ఉలిక్కిపడిన తెలంగాణ రాష్ట్రం .. గతంలో జరిగిన కిడ్నాప్లపై ఆందోళన చెందుతోంది. ఆ బాలికల మిస్సింగ్కు సైకో శ్రీనివాస్తో ఏమైనా సంబంధం ఉందా అని కలవరపడుతోంది. ఈ నేపథ్యంలో గతంలో జరిగిన బాలికల కిడ్నాప్ కేసులను మళ్లీ విచారించాలని మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు.
హెచ్చార్సీకి ఫిర్యాదు
గతంలో రాష్ట్రవ్యాప్తంగా కిడ్నాపైన బాలికల కేసులను తిరిగి విచారించాలని హెచ్చార్సీని హైకోర్టు లాయర్ రాపోలు భాస్కర్ కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు. యాద్రాది భువనగిరి జిల్లా హజీపూర్ ఘటనతో .. గతంలో బాలికల కిడ్నాప్ కూడా ఇలానే జరిగి ఉంటుందా అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

పెండింగులో 2 వేల కేసులు
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2 వేల మిస్సింగ్ కేసులు ఉన్నాయి. అయితే వివిధ కారణాల వల్ల ఈ కేసులను క్లోజ్ చేశారు. హజీపూర్ ఘటనతో వాటిని తిరిగి విచారించాలని రాపోలు కోరారు. అంతేకాదు బాలికల కిడ్నాప్నకు సంబంధించిన కేసుల విచారణకు ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటుచేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని విన్నవించారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications