ఆ 2 వేల కేసులను తిరిగి విచారించండి, ప్రత్యేక విభాగం కూడా : హెచ్చార్సీకి అడ్వకేట్ కంప్లైంట్
హైదరాబాద్ : బొమ్మాలరామారం ఘటనతో ఉలిక్కిపడిన తెలంగాణ రాష్ట్రం .. గతంలో జరిగిన కిడ్నాప్లపై ఆందోళన చెందుతోంది. ఆ బాలికల మిస్సింగ్కు సైకో శ్రీనివాస్తో ఏమైనా సంబంధం ఉందా అని కలవరపడుతోంది. ఈ నేపథ్యంలో గతంలో జరిగిన బాలికల కిడ్నాప్ కేసులను మళ్లీ విచారించాలని మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు.
హెచ్చార్సీకి ఫిర్యాదు
గతంలో రాష్ట్రవ్యాప్తంగా కిడ్నాపైన బాలికల కేసులను తిరిగి విచారించాలని హెచ్చార్సీని హైకోర్టు లాయర్ రాపోలు భాస్కర్ కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు. యాద్రాది భువనగిరి జిల్లా హజీపూర్ ఘటనతో .. గతంలో బాలికల కిడ్నాప్ కూడా ఇలానే జరిగి ఉంటుందా అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

పెండింగులో 2 వేల కేసులు
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2 వేల మిస్సింగ్ కేసులు ఉన్నాయి. అయితే వివిధ కారణాల వల్ల ఈ కేసులను క్లోజ్ చేశారు. హజీపూర్ ఘటనతో వాటిని తిరిగి విచారించాలని రాపోలు కోరారు. అంతేకాదు బాలికల కిడ్నాప్నకు సంబంధించిన కేసుల విచారణకు ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటుచేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని విన్నవించారు.












Click it and Unblock the Notifications